శభాష్ పూజా హెగ్డే.. 100 కుటుంబాల కోసం..

  • IndiaGlitz, [Wednesday,June 02 2021]

బుట్టబొమ్మ పూజా హెగ్డే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ సరసన నటించిన డీజే చిత్రం నుంచి ఆమె క్రేజ్ ఆకాశాన్ని తాకింది. బాలీవుడ్ లో కూడా ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయినే. క్యూట్ గా మాయ చేస్తూనే హాట్ గా కుర్రకారుని తనవైపు తిప్పుకుంది.

ఆ మధ్యన పూజా హెగ్డే కరోనాకి గురై కోలుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అనేక నిరుపేద కుటుంబాలు ఉపాధి లేక ఇల్లు గడవడమే కష్టంగా మారింది. అలాంటి వారిని ఆదుకునేందుకు పూజా హెగ్డే పెద్ద మనసుతో ముందుకు వచ్చింది.

ఇదీ చదవండి: చిన్నారికి చిరంజీవి ఫిదా.. బర్త్ డే రోజున ఏం చేసిందంటే..

పేద కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకులను అందిస్తోంది. 100 కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకుల్ని పూజ హెగ్డే అందిస్తోంది. పూజా పెద్ద మనసుతో చేస్తున్న ఈ సాయంపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. స్వయంగా పూజా హెగ్డే నిత్యావసర సరుకుల్ని ప్యాక్ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్ లో బడా చిత్రాల్లో నటిస్తోంది. ప్రభాస్ సరసన రాధే శ్యామ్ లో, మెగాస్టార్ ఆచార్యలో చరణ్ కు జోడిగా, అలాగే అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో పూజా నటిస్తుండడం విశేషం.

More News

ఆనందయ్య మందు పంపిణీకి డేట్ ఫిక్స్..!

ఆనందయ్య మందు పంపిణీ తేదీ ఖరారైనట్టు తెలుస్తోంది. వచ్చే సోమవారం అంటే ఈ నెల 7 నుంచి మందు పంపిణీ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది.

యూరప్‌లో ఎవరితో ఉన్నదీ చెప్పని విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ రేర్ రికార్డ్ కొట్టాడు. ఇంగ్లీష్ డైలీ పేపర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతియేటా నిర్వహించే 'మోస్ట్ డిజైరబుల్ మ్యాన్' సర్వేలో వరుసగా మూడోసారి టైటిల్ విన్నర్‌గా నిలిచాడు.

ముఖంపై ఉమ్మేసి, కొట్టించి... రివర్స్‌లో కేసు పెట్టిన టీవీ నటి?

హిందీ సీరియల్ 'యే రిష్తా క్యా కెహతా హై' యాక్టర్ కరణ్ మెహ్రాను మండే నైట్ ముంబయ్ పోలీసులు అరెస్ట్ చేశాడు. అతడిపై వైఫ్, టీవీ నటి నిషా రావల్ కేసు పెట్టింది.

చిన్నారికి చిరంజీవి ఫిదా.. బర్త్ డే రోజున ఏం చేసిందంటే..

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. విపత్కర సమయంలో చిరు తన సొంత ఖర్చుతో ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు

మన్మథుడు 2 ఫ్లాప్ కి కారణం ఆ ఒక్క సీనే : రాహుల్ రవీంద్రన్

కింగ్ నాగార్జున వెండితెరపై చేసే రొమాన్స్ చాలా అందంగా ఉంటుంది. నాగ్ స్టైల్ కి మహిళలో అభిమానులు ఎక్కువ. అందుకే నాగార్జున టాలీవుడ్ లో మన్మథుడు అయ్యారు.