‘ఆచార్య’లో పూజా హెగ్డే..!

ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి త‌న 152వ చిత్రం ‘ఆచార్య’ను పూర్తి చేసే ప‌నిలో బిజీ బిజీగా ఉన్నాడు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌లు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రామ్‌చ‌ర‌ణ్ జోడీగా ఎవ‌రు న‌టిస్తారు? అనే దానిపై ప‌లు వార్త‌లు వినిపిస్తున్నాయి. చ‌ర‌ణ్ జోడీగా ర‌ష్మిక మంద‌న్నా, కియారా అద్వానీ స‌హా ఫ‌‌లానా హీరోయిన్ న‌టిస్తుంది అని వార్త‌లు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ జోడీగా పూజా హెగ్డే న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా పూజా హెగ్డేను చిత్ర యూనిట్ సంప్ర‌దిస్తే ఆమె న‌టించ‌డానికి ఓకే చెప్పింద‌ని టాక్ వినిపిస్తోంది.

దేవాదాయ‌శాఖ‌లో అవినీతిని ప్ర‌శ్నించే విధంగా మంచి మెసేజ్‌తో సినిమా క‌థ‌ను డిజైన్ చేశాడ‌ట కొర‌టాల శివ‌. చిరంజీవి మాజీ నక్సలైట్ పాత్ర‌లో క‌నిపిస్తే.... రామ్‌చ‌ర‌ణ్ న‌క్సలైట్ నాయ‌కుడు పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

More News

నిన్నటి కంటే మెరుగ్గా రజనీకాంత్‌ ఆరోగ్యం: అపోలో వైద్యులు

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో

భారత్‌లో మార్చిలోనే ప్రవేశించిన స్ట్రెయిన్: ఐజీఐబీ వెల్లడి

కొవిడ్‌-19 మహమ్మారి క్రమక్రమంగా మ్యుటేషన్ చెందుతూ ఇబ్బందులు పెడుతూనే ఉంది.

హైద‌రాబాద్‌లో సోనూసూద్ హ‌ల్‌చ‌ల్‌..!

కోవిడ్ స‌మ‌యంలో రియ‌ల్ హీరోగా మారి ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలిచిన బాలీవుడ్ న‌టుడు సోనూసూద్‌..

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కూలీలు.. తెలతెలవారకముందే పని వెదుక్కుంటూ మరో ఊరుకు ఆటోలో బయల్దేరారు.

రజినీకాంత్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్..

సూపర్ స్టార్ రజినీకాంత్ హెల్త్ బులిటెన్‌ను అపోలో ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. రజినీ ఆరోగ్యాన్ని తమ వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని..