‘ఆచార్య’లో కేవలం 15 నిమిషాల కోసం పూజా షాకింగ్ రెమ్యునరేషన్..

  • IndiaGlitz, [Friday,March 05 2021]

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’. మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్‌ను రూపొందిస్తూ తన ప్రతి సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ వైపు నడిపించిన కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం అద్భుతమైన టెంపుట్ టౌన్ సెట్‌ను హైదరాబాద్‌ శివారులో వేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. నక్సలైట్ నాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. చెర్రీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే తాజాగా.. పూజా హెగ్డే గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో అమ్మడు కేవలం 15 నిమిషాలు మాత్రమే కనిపిస్తుందట. దీని కోసం 10 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొనున్నట్టు సమాచారం. అయితే ఈ 10 రోజుల షూటింగ్.. 15 నిమిషాల పాటు తెరపై కనిపించేందుకు ఈ ముద్దుగుమ్మ తీసుకునే రెమ్యునరేషనే షాకింగ్‌గా ఉంది. ఈ సినిమా కోసం పూజా కోటి రూపాయలు తీసుకున్నట్టు తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ‘అల వైకుంఠపురములో’ సక్సెస్ తర్వాత ఈ ముద్దుగుమ్మ తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసిందట.

ఇటీవలే చెర్రీ ఈ సినిమా షూటింగ్‌లో చరణ్ జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీలో చరణ్ సిద్ద అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే తెరపై చరణ్ కనిపించేది కొంతసేపే అయినా ఆ పాత్ర సినిమా అంతటా ప్రభావం చూపిస్తూనే ఉంటుందట. ఈ పాత్రను కొరటాల కొత్తగా డిజైన్ చేశారని సమాచారం. అవినీతిని సహించని యువకుడిగా చరణ్ కనిపించనున్నాడట. అలాగే డైలాగ్ డెలివరీ.. యాక్షన్ ఎపిసోడ్.. కొత్తగా ఉంటాయని చెబుతున్నారు. చిరంజీవి చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. ఆచార్య సినిమా మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ఇప్పటి నుంచే ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ప్రారంభమైంది.

More News

ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అవుతుంది, కాక‌పోవ‌చ్చు అయితే.. రాజ్ తరుణ్

యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్‌ల‌ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం ‘పవర్ ప్లే’.

కేరళ బీజేపీ అభ్యర్థిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్

ఇటీవల మెట్రో మ్యాన్ శ్రీధరన్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది.

సుశాంత్‌ని చంపినట్టు చంపేస్తారు: కంగన

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఎంత ధైర్యంగా బోల్డ్‌గా తన అభిప్రాయాలను వెల్లడిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అప్రమత్తంగా లేకపోవడం కూడా హానికరమే: వెంకీ కుడుమల

‘భీష్మ’ డైరెక్టర్‌ వెంకి కుడుములను ఇటీవల ఒక మోసగాడు మోసగించిన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల చాలా కథనాలు వెలువడ్డాయి.

నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్‌’ లీక్డ్ ఫొటోస్

దర్శకధీరుడు రాజమౌళికి కొత్త టెన్షన్ పట్టుకుంది. సినిమా పరంగానే కానీ, టెక్నికల్ టెన్షన్ కాదు.. లీకేజీ రాయుళ్ల సమస్య.