రెమ్యునరేషన్ వివాదం.. స్టార్ హీరోయిన్ కి పూజా హెగ్డే సపోర్ట్

  • IndiaGlitz, [Saturday,July 31 2021]

హీరోయిన్లకు కూడా హీరోలతో సమానంగా పారితోషికం ఉండాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. క్రేజీ బ్యూటీ తాప్సి ఈ విషయంలో ముందు నుంచి గళం విప్పుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆడియన్స్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలని కూడా ఆదరిస్తున్నారని.. కాబట్టి హీరోలతో సమానంగా తమకి కూడా రెమ్యునరేషన్ ఉండాలని తాప్సి గతంలో కామెంట్స్ చేసింది. అలాగే పౌరాణిక చిత్రంలో సీత పాత్ర కోసం కరీనా కపూర్ 12 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే.

కరీనా కపూర్ ని అంత రెమ్యునరేషన్ డిమాండ్ చేయడాన్ని తాప్సి సమర్ధించింది. తాజాగా మరో స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కి మద్దతు తెలిపింది. ఆమె ఎవరో కాదు.. బుట్టబొమ్మ పూజాహెగ్డే. పూజా హెగ్డే సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరు. దీనితో ఓ ఇంటర్వ్యూలో పూజా హెగ్డేకి కరీనా కపూర్ సీత పాత్ర కోసం 12 కోట్లు డిమాండ్ చేయడం గురించి ప్రస్తావన వచ్చింది.

ఇలాంటి విషయాల్లో ప్రజలకు ఎప్పుడూ ఏదో ఒక ఒపీనియన్ ఉంటుంది. కానీ కరీనా తనకు కావాల్సింది అడిగింది. ఆ హక్కు ఆమెకు ఉంది. ఈ విషయంలో చివరగా నిర్ణయం తీసుకోవాల్సింది నిర్మాతలు. కరీనా తనకు అవసరమైన డిమాండ్ చెప్పింది. నిర్మాతలకు అది ఒకే అయితే వాళ్ళు చర్చించుకుంటారు. ఇలాంటి విషయాల్లో ప్రజల నుంచి విమర్శలు, ట్రోలింగ్ సహజం. ఈ జాబ్ లో ఇది కామన్ గా మారిపోయింది. కరీనాకు మరింత శక్తి చేకూరాలి అని పూజా హెగ్డే కోరింది.

సహజంగా కరీనా ఒక చిత్రానికి 6 నుంచి 7 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తుంది. కానీ సీత పాత్ర కోసం ఏకంగా రూ 12 కోట్లు డిమాండ్ చేయడంతో బాలీవుడ్ సైతం ఆశ్చర్యంలో మునిగిపోయింది. పౌరాణిక పాత్ర కోసం మరీ ఇంత డబ్బు అడుగుతుందా అంటూ మత పరంగా కరీనా కపూర్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చెలరేగిన సంగతి తెలిసిందే.

More News

అఫీషియల్ : రాంచరణ్, శంకర్ మూవీ హీరోయిన్ ఖరారు

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఇండియా అగ్ర దర్శకులలో ఒకరైన శంకర్ కాంబోలో చిత్రం రోజు రోజుకూ భారీతనం సంతరించుకుంటోంది.

ఎమ్మార్వో ఆఫీస్ లో ఎన్టీఆర్.. చుట్టూ వాలిపోయిన ఉద్యోగులు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపిస్తే చాలు.. అభిమానులు ఎగబడుతుంటారు.

వైరల్ పిక్: చిరంజీవిని కలసిన 'రచ్చ' డైరెక్టర్.. ఏం జరుగుతోంది ?

ప్రతిభగల కమర్షియల్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించడం సంపత్ శైలి.

‘జీ 5’ ప్రారంభించిన ఉచిత కరోనా టీకా కార్యక్రమం ‘సంకల్పం’కు అద్భుత స్పందన

‘కల్యాణ వైభోగం’ స్టార్‌ మేఘనా లోకేష్‌, ‘రాధమ్మ కూతురు’ దీప్తీ మన్నేతో ‘ఎనీ టైమ్‌ మనోరంజనం’ (ఏటీయమ్‌) క్యాంపెయిన్‌ ప్రారంభించిన ‘జీ5’.

బన్నీతో పోల్చుకున్న అల్లు శిరీష్.. అదే పనిలో ఉన్నాడట!

మెగాస్టార్ మేనల్లుడిగా, అల్లు రామలింగయ్య మనవడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు టాప్ స్టార్.