close
Choose your channels

ప్రభాస్‌ను చూసి ఆశ్చర్యపోయాను: పూజా హెగ్డే

Saturday, October 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రభాస్‌ను చూసి ఆశ్చర్యపోయాను: పూజా హెగ్డే

ప్రస్తుతం టాలీవుడ్‌ స్టార్‌ హీరోలైన మహేశ్‌, తారక్‌, అల్లుఅర్జున్‌లతో కలసి నటించి స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సుందరాంగి పూజా హెగ్డే. ప్రస్తుతం తెలుగులో ఈ అమ్మడు నేషనల్‌ స్టార్‌ ప్రభాస్‌ సరసన ఓ సినిమాలో నటిస్తుంది. అలాగే ఈమె నటించిన ‘హౌస్‌ఫుల్‌ 4’ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా ఈమె ఓ అంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

“నా వద్దకు వచ్చిన ప్రేమకథల్లో ఇది గొప్ప ప్రేమకథ. ఓ మంచి లవ్‌స్టోరీలో ప్రభాస్‌లాంటి స్టార్‌ హీరోతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా యూరప్‌లో స్టార్ట్‌ అయ్యింది. యూరప్‌లో భారీ సెట్‌ వేసి సినిమాను చిత్రీకరించారు.

ఇక ప్రభాస్‌ గురించి చెప్పాలంటే తను చాలా సరదాగా ఉంటారు. ఆయన పక్కన ఉండే వాళ్లకి చాలా మంచి ఫుడ్‌ దొరుకుతుంది. ‘బాహుబలి’ వంటి పెద్ద హిట్‌ తర్వాత కూడా ప్రభాస్‌ నార్మల్‌గా ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. ప్రభాస్‌ సెట్‌లోని వారి కోసం మంచి వంటలను తయారు చేసి తీసుకొస్తారు” అని హోయలు పోయింది పూజాహెగ్డే. ప్రస్తుతం ఈమె బన్నీ సరసన నటించిన ‘అల వైకుంఠపురములో..’ చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే ఏడాదిలో సంక్రాంతికి బన్నీ సినిమాతో పూజ మన ముందుకు రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.