close
Choose your channels

అమ్మ‌డుకి ప‌వ‌ర్ ఫుల్ స్పెష‌ల్‌

Saturday, April 4, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అమ్మ‌డుకి ప‌వ‌ర్ ఫుల్ స్పెష‌ల్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు. బాలీవుడ్ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌ను ‘వ‌కీల్‌సాబ్‌’గా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇప్ప‌టికే 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. మ‌రో ప‌క్క రీసెంట్‌గానే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ త‌న 27వ సినిమాను స్టార్ట్ చేసినట్లు వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే ఈలోపు క‌రోనా వైర‌స్ విజృంభించ‌డంతో రెండు సినిమాల షూటింగ్‌ల‌ను ప‌వ‌న్ ఆపేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్తొక‌టి నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అదేంటంటే.. ఈ సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్ ఉంటుంద‌ట‌. అందులో పూజితా పొన్న‌డ న‌ర్తించ‌నుంద‌ట‌. రంగ‌స్థ‌లం, క‌ల్కి, వేర్ ఈజ్ వెంక‌ట ల‌క్ష్మి చిత్రాల్లో న‌టించిన పూజిత‌కు ప‌వ‌ర్‌స్టార్ సినిమాలో అవ‌కాశం రావ‌డ‌మంటే మంచి అవ‌కాశం ద‌క్కిన‌ట్లే. మ‌రి ఈ అవ‌కాశం ఆమె కెరీర్‌కు ఏ మేర‌కు హెల్ప్ అవుతుందో చూడాలి.

ఈ చిత్రంలో ద్విపాత్రాభిన‌యం చేస్తున్నార‌ని టాక్‌. ఇది పీరియాడిక‌ల్ జోన‌ర్‌లో తెర‌కెక్క‌నుంది. మొఘ‌ల్ కాలం నాటి ప‌రిస్థితుల ఆధారంగా సినిమాను రూపొందిస్తార‌ట‌. ఇందులో ప‌వ‌న్ ఓ బందిపోటు పాత్ర‌లో క‌న‌ప‌డ‌తార‌ట‌. దీంతో పాటు మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లోనూ ప‌వ‌న్ క‌న‌ప‌డ‌తార‌ని సినీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు విన‌డ‌ప‌తున్నాయి. పాన్ ఇండియా చిత్రంగా భారీ బ‌డ్జెట్‌తో, భారీ సెట్స్‌తో ఈ సినిమా నిర్మిత‌మ‌వుతోంది. అందుకు త‌గిన‌ట్లుగా ఈ చిత్రాన్ని డైరెక్ట‌ర్ క్రిష్ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో తెర‌కెక్కిస్తున్నార‌ట‌. ఈ సినిమాను ఈ ఏడాది దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.