close
Choose your channels

టాలీవుడ్‌లో మరో విషాదం : దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు కన్నుమూత

Saturday, November 27, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు కె.ఎస్‌ నాగేశ్వరరావు హఠాన్మరణం చెందారు. నిన్న తన స్వగ్రామం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఆయనకు హఠాత్తుగా ఫిట్స్‌ వచ్చాయి. దీంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ‍్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం తెలిపారు. నాగేశ్వరరావు భౌతికకాయాన్ని ప్రస్తుతం ఆయన అత్తగారి ఊరైనా నల్లజర్ల దగ్గరలోని కౌలురు గ్రామంలో ఉంచారు. అక్కడే కెఎస్‌ నాగేశ్వరరావు అంత్యక్రియలు జరగనున్నాయి.

'రిక్షా రుద్రయ్య'తో ఆయన టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అనంతరం ఆయన రియల్‌ స్టార్‌ శ్రీహరిని 'పోలీస్‌' సినిమాతో హీరోగా పరిచయం చేశారు. ఆ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. తర్వాత సాంబయ్య, శ్రైశైలం, దేశద్రోహి, శివన్న, వైజయంతి వంటి చిత్రాలు తెరకెక్కించారు నాగేశ్వరరావు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె వున్నారు.

కోడి రామకృష్ణ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన నాగేశ్వరరావు తలంబ్రాలు సినిమా నుంచి ఆయన వద్ద పనిచేస్తున్నారు. ఇటీవల తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ చదలవాడ శ్రీనివాసరావు నిర్మాతగా ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఇది ఇంకా సెట్స్ మీదే వుంది. అంతలోనే ఈ ఘోరం జరగడంతో సినీ ప్రముఖులు , సన్నిహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.