ఆయన వల్లే బతికా.. ఇక చనిపోను: పోసాని

  • IndiaGlitz, [Wednesday,July 31 2019]

టాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి అనారోగ్యంపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వదంతులు వచ్చిన విషయం విదితమే. అయితే ఇప్పుడు అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న ఆయన యధావిధిగా తన కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తన ఆరోగ్యం గురించి, ట్రీట్మెంట్ గురించి నిశితంగా వివరించారు. అంతేకాదు తనపై వస్తున్న వదంతులపై కూడా రియాక్ట్ అయ్యారు.

ఆయన వల్లే బతికా.. ఇక చచ్చిపోను!

తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను పోసాని తీవ్రంగా ఖండించారు. నేను పరిశ్రమలోకి అడుగుపెట్టి 33 సంవత్సరాలైంది. మే 13 నుంచి నా ఆరోగ్యం బాగులేదు. ఏర్నియాతో బాధపడుతుంటే యశోద ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నాను. శస్త్ర చికిత్సలో ఇన్ఫెక్షన్ వల్ల రెండు నెలలు బాధపడ్డాను. నేను చనిపోతానేమోనని చాలా భయపడ్డాను. లండన్ నుంచి సకాలంలో వైద్యులు రావడం వల్ల బతికిపోయాను. ఈ క్రమంలో నా ఆరోగ్యంపై సామాజిక మాద్యమాల్లో వదంతులు వ్యాపించాయి. పోసాని బతకడం కష్టమని వైరల్ చేశారు. నా ఆరోగ్యం బాగులేదంటే నాకు వేషాలు రావు. నేను ఇప్పటికి చాలా ఆరోగ్యంగా ఉన్నాను. డాక్టర్ ఎంవీరావు వల్లే నేను ఇప్పటికి బతికే ఉన్నాను. నేను ఇక చచ్చిపోను. రెండు నెలల్లో 10 కిలోల బరువు తగ్గాను. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను అని పోసాని చెప్పుకొచ్చారు.

More News

‘సైమా’కు ముఖ్యఅతిథులుగా చిరు, మోహన్‌లాల్

పాంట‌లూన్స్ సైమా (సౌత్ ఇండియన్‌ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్‌) ఎనిమిద‌వ అవార్డుల వేడుక ఆగ‌స్ట్ 15-16న ఖ‌తార్‌లో జ‌ర‌గ‌నున్న సంగతి తెలిసిందే.

'మేలుకో రైతన్నా.. మేలుకో' అంటున్న గద్దర్

ప్రజా గాయకుడు గద్దర్‌ పాటలు ఎంతో చైతన్యవంతంగా ఉంటాయి. అందర్నీ మేలుకొలిపే విధంగా ఉంటాయి. అలాంటి ఎన్నో అద్భుతమైన పాటల ద్వారా ప్రజా గాయకుడిగా పేరు తెచ్చుకున్న గద్దర్‌

‘షా’కు షాకిచ్చిన బీసీసీఐ.. మరో ఇద్దరికి కూడా!!

భారత దేశవాళీ క్రికెట్‌లో అత్యంత ప్రతిభావంతుడిగా పేరుగాంచిన ముంబై యువ సంచలనం పృథ్వీ ‘షా’కు బీసీసీఐ సడన్ షాకిచ్చింది.

యాక్షన్  సన్నివేశాల్లో నాగశౌర్య‌

యూత్ హీరో నాగ శౌర్య‌, బ‌బ్లీ బ్యూటీ మెహ‌రిన్ జంట‌గా ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌లుగా ప్రొడ‌క్ష‌న్ నెం 3 రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

కాకినాడ‌లో బ‌న్నీ యాక్ష‌న్‌

బ‌న్నీ 19వ చిత్రం `నాన్న నేను`(విన‌ప‌డుతున్న పేరు) త‌దుప‌రి షెడ్యూల్ కోసం కాకినాడ చేరుకుంది.