'వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే' : పోసానికి తన స్టైల్లో కౌంటరిచ్చిన పవన్

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌‌లో పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ఏపీలోని వైఎస్ జగన్‌ సర్కార్‌‌పై చేసిన వ్యాఖ్యలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఆన్‌‌లైన్‌ టికెట్‌ విధానంతో పాటు పరిశ్రమలోని సమస్యలపై తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. వైసీపీ మంత్రుల్నే కాకుండా నేరుగా సీఎం జగన్‌ పై విరుచుకుపడ్డారు పవన్‌ కళ్యాణ్‌. దీంతో ఆ రోజు నుంచి వైసీపీ నేతలు - పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నిన్న వైసీపీ సర్కార్‌‌ వైఫల్యాలపై పవన్‌ కళ్యాణ్‌ ట్విట్టర్‌ వేదికగా సంచలన ట్వీట్‌ చేశారు.

వైసీపీ … ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మరియు వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదంటూ.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు పవన్ కళ్యాణ్. మద్యపాన నిషేధం, కరెంటు చార్జీలు, ఉద్యోగాల భర్తీ మరియు రాజధాని అంశం ఇలా ఎన్నో వాగ్దానాలను వైసీపీ పార్టీ ఇచ్చిందని… కానీ వాటిలో ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదని నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్. అంతేకాదు వాగ్దానాలు నెరవేర్చకపోగా ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు . ఈ మేరకు ట్వీట్టర్‌లో ఓ టేబుల్ పోస్ట్ చేశారు.

అయితే పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి సైతం మీడియా ముందుకు రావడంతో పవర్‌స్టార్ మరింత చెలరేగిపోయారు. పోసాని ప్రెస్‌మీట్ పూర్తయిన కొద్దిసేపటికే పవన్ నాలుగు లైన్లు ట్వీట్‌ చేశారు.

''తుమ్మెదల ఝుంకారాలు .. నెమళ్ళ క్రేంకారాలు.. ఏనుగుల ఘీంకారాలు.. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే …'' నంటూ సదరు ట్వీట్‌లో దుయ్యబట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

More News

బిగ్‌బాస్ 5 తెలుగు: ముగ్గురికి రవి క్షమాపణలు... ప్రియపై రంకేలేసిన లోబో, ఈవారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే

బిగ్‌‌బాస్ 5 తెలుగు విజయవంతంగా నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. నిన్న లహరి ఎలిమినేషన్‌తో

తనిష్క్ రెడ్డి సమర్పిస్తోన్న ఏ.వి క్రియేటివ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ ‘ప్రొడక్షన్ నెం.1’ చిత్రం ప్రారంభం

తనిష్క్ రెడ్డి ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో ఏ.వి క్రియేటివ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై తనిష్క్ రెడ్డి, అంకిత సాహు హీరోహీరోయిన్లుగా

ఆది సాయి కుమార్ ‘అతిధి దేవో భవ’ నుండి  ‘బాగుంటుంది నువ్వు నవ్వితే’ పాట విడుద‌ల‌

ఆది సాయి కుమార్, నువేక్ష హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘అతిధి దేవో భవ’.  శ్రీనివాస క్రియేషన్స్ ప‌తాకంపై

‘కొండపొలం’ ట్రైలర్ విడుదల

ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం `కొండపొలం`తో మరోసారి అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు.

బన్నీ నెత్తిన పాలు పోసిన ఆమీర్ ప్రకటన.. ఇక రికార్డుల మోతేనా...!!!

మావయ్య మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన అల్లు అర్జున్ యాక్టింగ్,