ముచ్చింతల్‌లో సమతామూర్తిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్.. ఆ అర్హత మోడీదేనంటూ వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Monday,February 07 2022]

హైదరాబాద్ ముచ్చింతల్‌ చినజీయర్ ఆశ్రమంలో సమతామూర్తి రామానుజుల వారి 216 అడుగుల విగ్రహాన్ని దర్శించుకున్నారు జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమతా కేంద్రం వద్దకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇంత ఎత్తులో సమతామూర్తి విగ్రహం స్థాపించడం చినజీయర్ స్వామి మహాసంకల్పం వల్లే సాధ్యమైందని పవన్ ప్రశంసించారు. 108 దివ్య ఆలయాలు ఒకే చోట ఉండటం గొప్ప విషయమని... ఈ దివ్యక్షేత్రం భాగ్యనగరానికి సరికొత్త గుర్తుగా మారిందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగిన రామానుజ విగ్రహాన్ని నరేంద్ర మోడీ ఆవిష్కరించడం శుభపరిణామమన్నారు పవన్ . రాజకీయాలు పక్కన పెడితే ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసే అర్హత నరేంద్ర మోడీకే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం పవన్‌కల్యాణ్‌ను చినజీయర్ స్వామి ఆశీర్వించి.. సత్యరించారు. ముచ్చింతల్‌కు పవన్ వస్తున్నట్లు తెలుసుకున్న ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు.

ఇకపోతే.. శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం ఉత్సవాలకు పలువురు వీవీఐపీలు హాజరుకానున్నారు. ఫిబ్రవరి 7న ఏపీ సీఎం వైఎస్ జగన్ వేడుకల్లో పాల్గొంటారు. ఫిబ్రవరి 8న కేంద్ర హోంమంత్రి అమిత్ , ఫిబ్రవరి 9న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ .. ఫిబ్రవరి 10న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ .. ఫిబ్రవరి 11న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఫిబ్రవరి 12న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఫిబ్రవరి 13న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమతా స్ఫూర్తి కేంద్రానికి విచ్చేయనున్నారు.

More News

స్లో పాయిజిన్‌తో లతాజీ హత్యకు కుట్ర: వంటమనిషి మాయం, నేటికీ మిస్టరీయే..!!

దిగ్గజ గాయని లతా మంగేష్కర్ మరణంతో దేశం మూగబోయింది. లతాజీ నిష్క్రమణతో భారతీయ సంగీత ప్రపంచంలో ఓ అధ్యాయం ముగిసినట్లయ్యింది.

బాస్ ఈజ్ బ్యాక్.. కోవిడ్ తగ్గిందో లేదో సెట్‌లో వాలిపోయిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు శుభవార్త. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన వైరస్ నుంచి కోలుకున్నారు.

ప్రభుత్వ లాంఛనాలతో లతా మంగేష్కర్ అంత్యక్రియలు.. ముంబైకి ప్రధాని మోడీ

అనారోగ్యంతో కన్నుమూసిన దిగ్గజ నేపథ్య గాయనీ లతా మంగేష్కర్ అంత్యక్రియలు ఆదివారమే జరగనున్నాయి.

ప్రపంచమంతా తెలుగు సినిమావైపే.. టాలీవుడ్‌పై ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అని ప్రపంచం అనుకునేది. కానీ హిందీ పరిశ్రమే కాదు.

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత.. శోకసంద్రంలో సంగీత ప్రపంచం

దిగ్గజ నేపథ్య గాయని, భారతరత్న లత మంగేష్కర్ కన్నుమూశారు.  ఆమె వయసు 92 సంవత్సరాలు.