బాల‌య్య కోసం ప‌వ‌ర్ ఫుల్ టైటిల్‌తో సినిమా.. ఓకే అంటాడా?

  • IndiaGlitz, [Saturday,December 05 2020]

నంద‌మూరి బాల‌కృష్ణ‌తో డైరెక్ట‌ర్ సంతోష్ జాగ‌ర్ల‌పూడి ఓ సినిమాను చేయాల‌ని అనుకున్నాడు. ఆయ‌నకున్న మాస్ ఇమేజ్‌కు త‌గిన‌ట్లు ఓ క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడు. ముందుగా నిర్మాత అనీల్ సుంక‌ర‌ను క‌లిసి క‌థ‌ను వినిపించాడ‌ట‌. ఆయ‌న‌కు క‌థ బాగా న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి ఓకే చెప్పేశాడ‌ట‌. బల‌రామ‌య్య బ‌రిలోకి దిగితే అనే టైటిల్‌ను పెట్టి సంతోష్ శ్రీనివాస్ క‌థ‌ను సిద్ధం చేశాడ‌ట‌. ఇప్పుడు నిర్మాత అనీల్ సుంక‌ర.. బాల‌య్య‌ను క‌లిసి లైన్ క్లియర్ చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడ‌ట‌. ఎందుకంటే ప్ర‌స్తుతం బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్న బాల‌కృష్ణ త‌దుప‌రి సినిమా ఎవ‌రితో చేస్తాడ‌నే దానిపై క్లారిటీ లేదు. ఒక‌వైపు బి.గోపాల్ పేరు వినిపిస్తుంది.. దీంతో అనీల్ సుంక‌ర త‌దుప‌రి త‌న సినిమాను లైన్‌లో పెట్టాల‌ని అనుకుంటున్నాడ‌ట‌.

సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బోయపాటి ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కోవిడ్ త‌ర్వాత సినిమా షూటింగ్ పునః ప్రారంభ‌మైంది. ఇందులో ప్ర‌గ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, హీరోయిన్ పూర్ణ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

కాంగ్రెస్‌లో ప్రక్షాళన మొదలైంది.. టీపీసీసీ అధ్యక్షుడిగా...

ఒకప్పుడు తెలంగాణను ఏలిన పార్టీ.. ఇప్పుడు పూర్తిగా వరుస ఎదురు దెబ్బలతో అల్లాడుతోంది. వరుస వైఫల్యాలు ఈ పార్టీ నేతల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీస్తున్నాయి.

బిగ్‌బాస్ 4 గ్రాండ్ ఫినాలే గెస్ట్‌గా మహేష్!?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తున్న `బిగ్‌బాస్-4` కార్యక్రమం తుది అంకానికి చేరువవుతోంది.

రాజమౌళి శిష్యుడు దర్శకత్వంలో కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ‘కథ మొదలైంది’

దేశం గర్వించదగిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడైన సాయికృష్ణ కేవీ దర్శకత్వంలో ‘కథ మొదలైంది’

బీజేపీలోకి జానారెడ్డి.. నాగార్జున సాగర్ నుంచి బరిలోకి?

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రభావం కాంగ్రెస్ పార్టీపై దారుణంగా పడనుందా? కౌంటింగ్ ముగిసిన గంటల్లోనే అనూహ్య పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ వేదికవుతోందా?

వైసీపీలో చేరిన జనసేన ఎమ్మెల్యే రాపాక తనయుడు...

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తనయుడు రాపాక వెంకట్రామ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.