గ్యాప్‌లో.. ప్ర‌భాస్ 21 ద‌ర్శ‌కుడేం చేస్తున్నాడంటే..?

  • IndiaGlitz, [Monday,April 06 2020]

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం త‌న 20 సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. అదే స‌మ‌యంలో త‌న 21వ సినిమాను నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు. అంతా స‌జావుగానే సాగుతున్న‌స‌మ‌యంలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ప్ర‌భాస్ 20వ సినిమా షూటింగ్ ఆగింది. ఈ ప్ర‌భావం ప్ర‌భాస్ 21పై ప‌డింది. దీంతో న‌వంబ‌ర్‌లో ప్రారంభించాల‌నుకున్న ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ సినిమా ఆల‌స్య‌మ‌య్యే అవకాశం క‌న‌ప‌డుతుంది. దీంతో నాగ్ అశ్విన్ వెయిట్ చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే ఈ ద‌ర్శ‌కుడు ఈ గ్యాప్‌ను వృథా చేయ‌కూడ‌ద‌ని అనుకుంటున్నాడ‌ట‌. అందుక‌ని ఓ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించాల‌నుకున్నాడ‌ట‌.

సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు నాగ్ అశ్విన్ తెర‌కెక్కించ‌బోయే ఈ వెబ్ సిరీస్‌ను హీరో రానా నిర్మించ‌బోతున్నాడ‌ట‌. తాత రామానాయుడు, తండ్రి సురేష్‌బాబు అడుగు జాడ‌ల్లోని రానా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ట‌. ఇప్పుడిప్పుడే రానా నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నాడు. ఒక వైపు సినిమాల్లోన‌టిస్తూనే మ‌రో వైపు కొత్త టాలెంట్‌ను, కాన్సెప్ట్‌ను ఎంక‌రేజ్ చేయ‌డానికి రానా ప్లాన్ చేస్తున్నాడు.

More News

'లూసీఫర్' రీమేక్‌ పవన్ చేస్తానంటే.. : చిరు రియాక్షన్ ఇదీ..

మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ టైటిల్ పాత్రలో న‌టించిన ‘లూసిఫ‌ర్‌’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రామ్‌చ‌ర‌ణ్ నిర్మించ‌బోతున్నాడు.

'ఆచార్య'లో మహేశా.. చెర్రీనా.. క్లారిటీ ఇచ్చేసిన చిరు

టాలీవుడ్ మోగాస్టార్ చిరంజీవి.. సూపర్ హిట్ చిత్రాల, సందేశాత్మక చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా ‘ఆచార్య’. ఇప్పటికే సినిమాకు సంబంధించి దాదాపు అన్ని విషయాలు లీకైపోయాయి.

గోపీచంద్ స‌ర‌స‌న హాట్ బ్యూటీ

టాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ గోపీచంద్ హీరోగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సీటీమార్’. స్పోర్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ఏపీలో 190కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గంటగంటకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 164 ఉన్న కేసులు.. శనివారం సాయంత్రానికి 190కు చేరుకుంది.

కరోనాను జయించిన సింగర్ కనికా కపూర్!

బాలీవుడ్ ప్రముఖ సింగర్ కనికా కపూర్ ఎట్టకేలకు కరోనా నుంచి బయటపడింది. ఇప్పటి వరకూ నాలుగుసార్లు జరిపిన టెస్టుల్లో పాజిటివే రాగా..