పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్.. ఏపీ వరద బాధితులకు రూ.కోటి విరాళం, అభిమానుల ప్రశంసలు

  • IndiaGlitz, [Tuesday,December 07 2021]

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవడానికి చిత్ర పరిశ్రమ నడుం బిగించింది. సర్వం కోల్పోయి నిరాశ్రయిలైన అభాగ్యులకు చేయూతను అందించడానికి తారా లోకం కదిలింది. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, చిరంజీవి, రామ్‌చరణ్, అల్లు అర్జున్‌‌లు తమ వంతుగా తలో రూ.25 లక్షలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ లిస్ట్‌లో చేరారు. నలుగురికి సాయం చేయడంలో ఒక అడుగు ముందే వుండే ప్రభాస్.. తోటి హీరోల కంటే ఎక్కువగానే ఏకంగా రూ.కోటిని ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేస్తున్నట్లు ప్రకటించారు.

త్వరలో ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందజేయనున్నారు. ప్రభాస్ ఇలా భారీ మొత్తం విరాళం ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో కరోనా సమయంలో ప్రధానమంత్రి సహాయనిధికి... అటు ఏపీ , తెలంగాణ సీఎంల సహాయనిధికి... మొత్తం 4.5 కోట్ల రూపాయలు విరాళంగా అందించి తన పెద్ద మనసు చాటుకున్నారు. అలాగే గతేడాది హైద‌రాబాద్‌ మహా నగరాన్ని భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు ముంచెత్తిన‌ప్పుడూ కూడా ప్రభాస్ విరాళం అందించారు. తాజాగా ఇప్పుడు ఏపీ వరద బాధితులకు కోటి రూపాయలు విరాళం ఇవ్వడంతో... ఆయనపై అభిమానులు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్- పూజా హెగ్డే జంటగా నటిస్తున్న... 'రాధే శ్యామ్' సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. వీటితో పాటు 'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్ కె' సినిమాలు చేస్తున్నారు ప్రభాస్.

More News

బిగ్‌బాస్ 5 తెలుగు: సిరి- సన్నీల మధ్య లింక్.. తట్టుకోలేకపోయిన షన్నూ, టాప్ 6లో ఎవరెవరంటే..?

బిగ్‌బాస్ 5 తెలుగు 14వ వారానికి చేరుకుంది. దీంతో తెలుగు నాట విన్నర్ ఎవరంటూ డిస్కషన్ షురూ అయ్యింది.

 పైట లేకుండా .. నోటిలో బ్లేడు పెట్టుకుని, టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా ‘‘అనసూయ’’ రోల్‌

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ‘‘పుష్ప’’ సినిమా ట్రైలర్ ఈ సోమవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కట్టప్ప కుటుంబంలో విషాదం

సీనియర్ నటుడు సత్యరాజ్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన చెల్లెలు కల్పన మండ్రాదియార్‌(66) శనివారం సాయంత్రం కన్నుమూశారు.

పుష్ప ట్రైలర్ : ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్...!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమా‌పై పరిశ్రమలో భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే.

బన్నీ అభిమానులకు ‘‘పుష్ప’’ టీం షాక్.. ట్రైలర్ వాయిదా, కారణమిదే..?

ఈ మధ్యకాలంలో మేకర్స్ .. అభిమానుల సహనంతో ఆడుకుంటున్నారు. మొన్నామధ్య ‘‘రాధేశ్యామ్ ’’ మొదటి పాట రిలీజ్ విషయంలో రగడ నడిచింది.