close
Choose your channels

ప్ర‌భాస్ త‌దుప‌రి షెడ్యూల్ ఎప్ప‌టి నుండంటే!

Wednesday, December 11, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్ర‌భాస్ త‌దుప‌రి షెడ్యూల్ ఎప్ప‌టి నుండంటే!

`బాహుబ‌లి`తో నేష‌న‌ల్ స్టార్‌గా ఎదిగిన యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ త‌ర్వాత `సాహో` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ చిత్రం ప్యాన్ ఇండియా చిత్రంగానే విడుద‌లైనప్ప‌టికీ బాహుబ‌లిలా ప్రేక్ష‌కుల‌ను అన్ని భాష‌ల్లో ఆక‌ట్టుకోలేదు. అయితే ప్ర‌భాస్ ఇప్పుడు చేస్తోన్న తాజా చిత్రం `జాన్‌`(విన‌ప‌డుతున్న టైటిల్‌)ని కూడా ప్యాన్ ఇండియా చిత్రంగానే విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. అందుకు త‌గిన‌ట్లుగానే సినిమా రూపొందుతోంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుద‌ల కానుంది.

ప్ర‌స్తుతం ఈ సినిమా త‌దుప‌రి షెడ్యూల్‌కు సిద్ధ‌మ‌వుతుంది. వివ‌రాల ప్ర‌కారం జ‌న‌వ‌రి మొద‌టి వారం నుండి అన్న‌పూర్ణ స్టూడియోలో చిత్రీక‌రించ‌నున్నారు. ఈ షెడ్యూల్ కోసం అన్న‌పూర్ణ స్టూడియోలో సెవెన్ ఏకర్స్‌లో మూడు భారీ సెట్స్ వేశారట‌. 1960-70 బ్యాక్‌డ్రాప్‌తో లింక్ అవుతూ నేటి కాలానికి కొన‌సాగే ప్రేమ‌క‌థాశంతో ఈ సినిమా ఉంటుంద‌ట‌. పూర్వ‌జ‌న్మ‌లో ధ‌న‌వంతుడిగా ప్ర‌భాస్‌, పేద అమ్మాయిగా పూజా హెగ్డే పుడుతుంద‌ట‌. ఆ స‌మ‌యంలో విఫ‌ల‌మైన వారి ప్రేమ ఇప్ప‌టి కాలంలో ఎలా క‌లిసింద‌నేదే క‌థ‌ట‌. ప్ర‌భాస్ ఇందులో హ‌స్త‌సాముద్రిక తెలిసిన వ్య‌క్తిగా క‌న‌ప‌డ‌బోతున్నాడ‌ట‌. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.