శర్వానంద్ కోసం ప్రభాస్...

  • IndiaGlitz, [Tuesday,September 12 2017]

శ‌ర్వానంద్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్ గా, మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వంశీ, ప్ర‌మొద్ లు సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం మ‌హ‌నుభావుడు చిత్ర షూటింగ్ ఇటీవలే విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఇట‌లీ, ఆస్ట్రియా, క్రోయెషియా లాంటి విదేశాల్లో మ‌రియు పోలాచ్చి, రామోజీ ఫిల్మ్‌సిటి, హైద‌రాబాద్ లో ని అంద‌మైన లోకేష‌న్స్ లో షూటింగ్ జ‌రుపుకుంది. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల‌వుతుంది.

వ‌చ్చేవారం ఆడియో విడుద‌ల‌కు ప్లాన్స్ జ‌రుగుతున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా ఆడియో వేడుక‌కు యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడ‌ట‌. గ‌తంలో శ‌ర్వానంద్ న‌టించిన ర‌న్‌రాజార‌న్‌, ఎక్స్‌ప్రెస్‌రాజా సినిమాల ఆడియో వేడుక‌ల‌ను ప్ర‌భాస్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇప్పుడు మూడోసారి కూడా ప్ర‌భాస్ చీఫ్ గెస్ట్‌గా రానుండ‌టం విశేషం.