ముంబైలో ప్రభాస్ 'సాహో'
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి క్రేజ్ 'బాహుబలి'తో అమాంతం పెరిగింది. ఇప్పుడు ప్రభాస్ సినిమాల గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. `బాహుబలి` తర్వాత ప్రభాస్ రెండు సినిమాలను చేస్తున్నాడు. అందులో ముందుగా 'సాహో' సినిమా విడుదలవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు టీజర్స్ సినిమా యాక్షన్ జోనర్లో మెప్పించనుందని చెప్పకనే చెప్పేశాయి.
'బాహుబలి' తర్వాత నేను చేస్తోన్న మరో యాక్షన్ మూవీ. ప్రేక్షకులు కూడా నేను యాక్షన్ చిత్రాల్లో నటించడానికి ఆసక్తిని కనపరుస్తున్నారు' అని ప్రభాస్ ఓ సందర్భంలో చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ముంబైలో కీలక సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంటోంది.
ఈ షెడ్యూల్తో సినిమా షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. సినిమాను ఆగస్ట్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని తర్వాత ప్రభాస్ వెంటనే తన 20వ సినిమా షూటింగ్లో పాల్గొంటారు. ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదలవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.