ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ .. కాస్త వెన‌క్కి..!

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ ఓ సినిమాను నిర్మించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’ త‌ర్వాత ఈ సినిమానే చేయ‌నున్న‌ట్లు నిర్మాత‌లు తెలిపారు. ఆ త‌ర్వాత కొన్నిరోజుల‌కే ప్ర‌భాస్ హీరోగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓంరావుత్ ద‌ర్శ‌క‌త్వంలో ‘ఆదిపురుష్‌’ చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు. ఇవి కాకుండా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ సినిమా ఉండొచ్చున‌నే వార్త‌లు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్ర‌భాస్, నాగ్ అశ్విన్ సినిమా వెన‌క్కి జ‌రిగింద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి.

నాగ్ అశ్విన్ సినిమా కంటే ముందుగానే, ఆదిపురుష్ సినిమాను ప్ర‌భాస్ ట్రాక్ ఎక్కిస్తాడు. అలాగే దాని త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. దీని త‌ర్వాతే నాగ్ అశ్విన్ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంద‌ని స‌మాచారం. ఆ లెక్క‌లో ప్ర‌భాస్, నాగ్ అశ్విన్ సినిమా 2022లో స్టార్ట్ అవుతుంద‌ని అంటున్నారు. ఈ సినిమాలో దీపికా ప‌దుకొనె హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, బిగ్ బి అమితాబ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

More News

‘పుష్ప’ సినిమాలో విల‌న్స్ ఎంత మందో తెలుసా?

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ‘ఆర్య‌, ఆర్య 2’ త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’.

28న హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోదీ..

ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. ఆకస్మికంగా ఆయన పర్యటన ఖరారైంది. ఈ నెల 29న ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రానున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ

టాలీవుడ్ యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది.

అదరగొట్టేసిన అఖిల్, సొహైల్...

ఓపెనింగే.. హారిక.. అభి ఫీల్ అయిన విషయాన్ని మోనాల్‌కు చెప్పింది. గతంలో తనకు.. అభికి మధ్య జరిగిందంతా హారికకు మోనాల్ చెప్పింది.

ప‌దేళ్ల త‌ర్వాత సునీల్‌తో జోడీ క‌డుతున్న హీరోయిన్‌

క‌మెడియ‌న్ నుండి హీరోగా మారిన సునీల్‌కు అందాల రాముడు, పూల‌రండు, మ‌ర్యాద‌రామ‌న్న వంటి రెండు, మూడు త‌ప్ప చెప్పుకునేంత విజ‌యాలు లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా మారిపోయాడు.