స్వీయ నిర్బంధంలో ప్ర‌భాస్‌

  • IndiaGlitz, [Friday,March 20 2020]

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌.. స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అందుకు కార‌ణ‌మేంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క‌రోనా వైర‌స్‌. విదేశాల్లో నుండి వ‌స్తున్న వారిపై క‌రోనా వైర‌స్ బారిన ప‌డుతున్నారు. అందువ‌ల్ల ప్ర‌భుత్వాలు విదేశాల నుండి వ‌చ్చిన వారు బ‌య‌ట‌కు రాకండ‌ని, ఆరోగ్య జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాలు సూచిస్తున్నాయి. ఆ క్ర‌మంలో రీసెంట్‌గా ప్ర‌భాస్ 20 సినిమా షూటింగ్ యూర‌ప్‌లోని జార్జియాలో జ‌రిగింది. ఈ షెడ్యూల్ షూటింగ్ ముగించుకుని ఇండియా వ‌చ్చిన ఎంటైర్ యూనిట్ స్వీయ నిర్బంధంలోకి ఉంటున్నారు. ఇప్ప‌టికే పూజా హెగ్డే, ప్రియ‌ద‌ర్శి త‌మ‌కు తాము స్వీయ నిర్బంధంలో ఉంటున్న‌ట్లు తెలిపారు. ఇప్పుడు ఈ లిస్టులో ప్ర‌భాస్ జాయిన్ అయ్యారు. అయితే ప్ర‌భాస్ తాను స్వీయ నిర్బంధంలో ఉంటున్న‌ట్లు చెప్ప‌లేదు. కానీ ఆయ‌న బ‌య‌ట‌కు రావ‌డం లేదు.. ఎవ‌రినీ క‌ల‌వ‌డం లేద‌ట‌.

ప్ర‌భాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో గోపీ కృష్ణామూవీస్‌,యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతోన్న ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ మాత్రం క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాతే ఉంటుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిని ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు.

More News

రెండో పెళ్లి చేసుకున్న అమ‌లాపాల్‌... ఫోటోలు వైరల్

కేర‌ళ ముద్దుగుమ్మ అమ‌లాపాల్ త‌న ప్రియుడు, సింగ‌ర్ భ‌వ్నీంద‌ర్ అడైను వివాహ‌మాడింది. గ‌త కొన్ని రోజుల ముందు నుండి వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నారు. సోష‌ల్ మీడియాలో వీరిద్ద‌రూ క‌లిసి

బ్రేకింగ్: తెలంగాణలో ‘పది’ పరీక్షలు వాయిదా

తెలంగాణలో ఇటీవలే పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా అంతా కరోనా నేపథ్యంలో బంద్‌లో ఉన్నప్పటికీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు..

బలపరీక్ష ఎదుర్కోకుండానే కమల్‌నాథ్ రాజీనామా

బలపరీక్షకు ముందే మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ సాయంత్రం 5గంటలకు బలపరీక్ష జరగనుంది. అయితే.. బలపరీక్ష ఎదుర్కోకుండానే కమల్‌నాథ్ రాజీనామా చేసేశారు.

యుద్ధాల కంటే ప్రమాదకరం.. 22న ఎవరూ బయటికి రావొద్దు!

మహమ్మారి కరోనా అంతకంతకూ వ్యాప్తి చెందుతుండడంతో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ దేశ ప్రజలను సున్నితంగా హెచ్చరించారు. జాతిని ఉద్దేచించి గురువారం నాడు మోదీ మాట్లాడారు.

దేశ చరిత్రలో ఫస్ట్ టైం..: ఎట్టకేలకు నిర్భయ నిందితులకు ఉరి

దేశ రాజధాని ఢిల్లీలో పెను సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిందితులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు అయ్యింది. ఎన్నో ట్విస్ట్‌లు.. మరెన్నో వాయిదాలు.. ఇంకెన్నీ పిటిషన్ల మధ్య ఎట్టకేలకు శుక్రవారం తెల్లారుజామున