షూటింగ్ షురూ చేసిన ప్ర‌భాస్

  • IndiaGlitz, [Friday,January 17 2020]

బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ త‌ర్వాత వ‌చ్చిన సాహోతో ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని మాత్రం అందుకోలేక‌పోయాడు.

అయితే ఈసారి చేస్తున్న పీరియాడికల్ లవ్‌స్టోరీ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుంట‌న్నాడు. ఈరోజు ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ విష‌యాన్ని హీరో ప్ర‌భాస్ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఓ ఫొటోను పోస్ట్ చేస్తూ తెలియ‌జేశారు.

ఇదొక ఫ‌న్ షెడ్యూల్ అనే మెసేజ్ కూడా ఆయ‌న పోస్ట్ చేశారు. ఈ సినిమా కోసం అన్న‌పూర్ణ స్టూడియోలో సెవెన్ ఏకర్స్‌లో మూడు భారీ సెట్స్ వేశారట‌. 1960-70 బ్యాక్‌డ్రాప్‌తో లింక్ అవుతూ నేటి కాలానికి కొన‌సాగే ప్రేమ‌క‌థాశంతో ఈ సినిమా ఉంటుంద‌ట‌. పూర్వ‌జ‌న్మ‌లో ధ‌న‌వంతుడిగా ప్ర‌భాస్‌, పేద అమ్మాయిగా పూజా హెగ్డే పుడుతుంద‌ట‌. ఆ స‌మ‌యంలో విఫ‌ల‌మైన వారి ప్రేమ ఇప్ప‌టి కాలంలో ఎలా క‌లిసింద‌నేదే క‌థ‌ట‌.

ప్ర‌భాస్ ఇందులో హ‌స్త‌సాముద్రిక తెలిసిన వ్య‌క్తిగా క‌న‌ప‌డ‌బోతున్నాడ‌ట‌. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. యువీ క్రియేష‌న్స్‌, గోపీకృష్ణ‌మూవీస్ ప‌తాకాల‌పై సినిమా నిర్మిత‌మ‌వుతోంది.

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

More News

ఎల్ వి ప్రసాద్ ధైర్యం చెప్పక పోయివుంటే నేను నటుడిగా నిలపడేవాణ్ణి కాదు - కృష్ణం రాజు

భారత చలనచిత్ర పితామహుడు, మూకీ యుగం నుండి డిజిటల్ మూవీస్ వరకు నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్బిటర్ గా, ఫిలిం ల్యాబ్ అధినేతగా భారత సినీ పరిశ్రమ మార్గదర్శకుడు ఎల్.ప్రసాద్,

'అల... వైకుంఠపురంలో' విజయోత్సవ వేడుక వివరాలు

'అల... వైకుంఠపురంలో' చిత్రానికి ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ అత్యద్భుతంగా ఉంది. విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ గా నమోదు చేసుకుంది..

ఎంజీఆర్ లుక్ లో ఒదిగిపోయిన అరవింద్ స్వామి

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న‌ చిత్రం `త‌లైవి`. బాలీవుడ్‌క్వీన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

పూజా హెగ్డే.. భలే ఛాన్స్ కొట్టేసింది!

కన్నడ కస్తూరి పూజా హెగ్డేకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. వరుసపెట్టి అగ్రహీరోలతో సినిమాలు చేస్తున్న పూజా.. తాజాగా మరోస్టార్ హీరోతో జతకట్టడానికి రెడీ అవుతోందట. ఇంతకూ ఆయనెవరు అనుకుంటున్నారా..

సురేష్ బాబు కు ఝలక్ ఇచ్చిన అమెజాన్

ఓటీటీలతో తస్మాత్ జాగ్రత్త.. అంటూ సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు హెచ్చరించిన విషయం తెలిసిందే. నిర్మాణ విలువలతో పాటు.. వ్యాపార విలువలు బాగా తెలిసిన వ్యక్తి కావడంతో..