ఇట‌లీ బ‌య‌లుదేరిన ప్ర‌భాస్‌

  • IndiaGlitz, [Thursday,October 01 2020]

బాహుబ‌లి’ త‌ర్వాత ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్‌.. ఇప్పుడు ఆ రేంజ్‌లోనే సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్ర‌భాస్ మూడు ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. అందులో ముందుగా ‘రాధేశ్యామ్’ సెట్స్‌పై ఉంది. క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఆగిన ఈ సినిమా షూటింగ్ అక్టోబ‌ర్‌లో ప్రారంభ‌మైంది. నిజానికి క‌రోనా ముందు యూర‌ప్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న ప్ర‌భాస్ అండ్ టీం క‌రోనా ఎఫెక్ట్‌తో ఇండియా చేరుకుంది.

హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోలో ‘రాధేశ్యామ్’ కోసం రెండు భారీ సెట్స్ కూడా వేశార‌ని వార్త‌లు వినిపించాయి. అలాగే లాక్‌డౌన్ ముగిసిన వెంట‌నే ప‌రిస్థితుల‌ను చూసుకుని ప్ర‌భాస్ అండ్ టీమ్ ఇటలీ వెళ్ల‌బోతున్నారంటూ వార్త‌లు వినిపించాయి. ఈ వార్త‌ల మేర‌కే ప్ర‌భాస్ అండ్ టీమ్ ఇట‌లీకి బ‌య‌లుదేరింది. కోవిడ్ స‌మ‌యంలో విదేశాల్లో షూటింగ్ జ‌రుపుకోనున్న తొలి టాలీవుడ్ చిత్ర‌మిదే అవుతుంది. ‘రాధేశ్యామ్’ను వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లోనే విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. ఈ పీరియాడిక్ ల‌వ్‌స్టోరిలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణామూవీస్‌, యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌ నిర్మిస్తున్నాయి.

More News

సోషల్ మీడియాను దున్నేస్తున్న ‘నాది నక్కిలీసు గొలుసు’..

‘నాది నక్కిలీసు గొలుసు’ సాంగ్ వినని వారు ఎవరైనా ఉన్నారా? అని ఇప్పుడు అడగటం ఫూలిష్ నెస్ అవుతుందేమో..

ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో ఒక్క సెప్టెంబర్‌లోనే 40 శాతం కేసులు..

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. సెప్టెంబర్ నెలలో కరోనా మరింత తీవ్ర రూపం దాల్చింది.

జ‌యం' ర‌వి, ‘అర‌వింద్‌స్వామి’ ల  'బోగ‌న్‌' ట్రైల‌ర్ విడుద‌ల‌

ఇటీవ‌ల 'బోగ‌న్' చిత్రాన్ని రామ్ తాళ్లూరి తెలుగులో అందిస్తున్నార‌నే ప్ర‌క‌ట‌న రాగానే, ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది.

యాక్షన్‌తో ప్రారంభం కానున్న ‘పుష్ప‌’

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ‘ఆర్య‌, ఆర్య 2’ త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’.

ఆసుపత్రిలో కేటీఆర్ తనయుడు.. అసలేం జరిగిందంటే..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.