కోర్టు సమస్యల్లో ప్రకాశ్‌రాజ్

  • IndiaGlitz, [Sunday,August 25 2019]

హిందీ సహా దక్షిణాది భాషల్లో పలు వైవిధ్యమైన పాత్రలు పోషించి నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదిచుకున్నాడు ప్రకాశ్‌రాజ్. తెలుగు, తమిళంలో దర్శకుడిగా ఉలవచారు బిర్యానీ అనే సినిమాను రూపొందించారు. ఆ సినిమా గొప్ప విజయాన్ని సాధించకపోయినా.. దర్శకుడిగా ప్రకాశ్‌రాజ్‌కి విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చాయి.

అలాగే తన దర్శకత్వంలో ‘మన ఊరి రామాయణం’ సినిమాను కూడా డైరెక్ట్ చేశారు ప్రకాశ్‌రాజ్. ఈ సినిమా తర్వాత ఉలవచారు బిర్యానీతో దర్శకుడితో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. 2016లో ఈ రీమేక్‌కి ‘తడ్కా’ అనే టైటిల్‌ను కూడా అనౌన్స్ చేశాడు. అయితే ఆర్దిక సమస్యలు కారణంగా ఈ రీమేక్ ఆగిపోయింది. ప్రకాశ్‌ రాజ్ నిర్మాణంలో భాగస్వామ్యులైన జీ గ్రూపోవర్, ఎసెల్ విజన్ సంస్థలు ప్రకాశ్ రాజ్‌పై కేసు నమోదు చేశాయి. జూలై 15 నాటికి ప్రకాశ్‌రాజ్ చెల్లించాల్సిన రూ.5.88కోట్లను చెల్లించలేదని పిటిషన్ వేశాయి. అయితే పరిస్థితిని చేయి దాటిపోయి, అరెస్టులు గట్రా కాకుండా ప్రకాశ్‌రాజ్ జాగ్రత్త పడ్డాడు. పార్ట్‌నర్స్‌కు రెండు కోట్ల రూపాయల చెక్‌తో పాటు తన ఆస్థి పత్రాలను కూడా ఇచ్చాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరికి మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తానని లేకుంటే ప్రాపర్టీని స్వాధీనం చేసుకోవాలని సూచించాడు. దీంతో జీ గ్రూపోవర్, ఎసెల్ విజన్ సంస్థలు ప్రకాశ్‌రాజ్‌కి సమయాన్ని కేటాయించాయి. ప్రస్తుతం ప్రకాశ్‌రాజ్ ఇచ్చిన చెక్ బౌన్స్ అయితే దీనికి మరో కేసు కూడా తోడవుతుంది.

రాజకీయాల వైపు మొగ్గు

జస్ట్ ఆస్కింగ్ పేరుతో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. క్రమంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రకాశ్‌రాజ్ సెంట్రల్ బెంగళూరు నుండి ఇండిపెండెంట్‌ పార్లమెంట్ మెంబర్‌గా పోటీ చేశారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయాడు ప్రకాశ్‌రాజ్. ఎన్నికలు తర్వాత మళ్లీ సినిమాల వైపు మొగ్గు చూపారు. ఆయన కారణంగానే జగపతిబాబుని సరిలేరు నీకెవ్వరు నుండి రీప్లేస్ చేశారనే ఉహగానాలు కూడా వినపడుతున్నాయి. సాధారణంగా ప్రకాశ్‌రాజ్ చేతిలో రెండు, మూడు ప్రాజెక్టులుంటాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఈ ఏడాది మహేశ్ ‘సరిలేరునీకెవ్వరు’ సినిమా మాత్రమే ఉంది.

More News

స్టోరీని మార్చేస్తున్న అల్లు అర్జున్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురంలో..’. ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ముగియనుంది. మరి తదుపరి బన్నీ ఏ సినిమా చేస్తాడనే దానిపై

ఏపీ రాజధాని నిర్మాణంపై బాంబ్ పేల్చిన బీజేపీ ఎంపీ!

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం అసలు అక్కడే ఉంటుందా..? లేకుంటే తరలింపు ఉంటుందా..? అనేదానిపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన

నాగార్జునకు అస్వస్థత.. అసలేమైంది.. నిజమేనా!?

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున అస్వస్థతకు గురైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా, వెబ్‌సైట్లలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

మళ్లీ మళ్లీ.. బొత్స నోట అదే మాట.. అసలేంటి కథ!?

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన విషయం విదితమే. బొత్స మాటలతో అటు రాజధాని రైతులు,

యమునా నది తీరంలో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు

కమల దళంలో ట్రబుల్‌ షూటర్‌‌, కేంద్ర మాజీ మంత్రి, మోదీ-షాలకు రైట్ హ్యాండ్‌గా పేరుగాంచిన అరుణ్‌జైట్లీ అంత్యక్రియలు నేడు 2:30 గంటలకు యమునానది తీరంలోని నిగంబోధ్‌ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి.