ప్రకాష్ రాజ్ టీం రెడీ.. అనసూయ, సుడిగాలి సుధీర్, బండ్ల గణేష్..

ప్రకాష్ రాజ్ జోరు చూస్తుంటే మా ఎన్నికల్లో ఈ విలక్షణ నటుడు ఏదో సంచలనమే చేయబోతున్నట్లు అనిపిస్తోంది. మొట్ట మొదటగా అధ్యక్ష పదవి బరిలో నిలిచింది ప్రకాష్ రాజే కావడం విశేషం. ఆ తర్వాత మంచు విష్ణు, జీవిత, హేమ పోటీలో నిలిచారు. మా ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రకాష్ రాజ్ తన ప్లానింగ్ తో దూసుకుపోతున్నారు.

ఇదీ చదవండి: సూపర్ డూపర్ అంటూ రామ్ ట్వీట్.. లింగుస్వామి మూవీ అప్డేట్!

నాన్ లోకల్ అనే విమర్శలకు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రకాష్ రాజ్ ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా ప్రకాష్ రాజ్ మరో ముందడుగు వేశారు. మా ఎన్నికల్లో పోటీ చేసే తన ప్యానల్ ని ప్రకటించేశారు. ప్రకాష్ రాజ్ తో సహా మొత్తం 27 మందితో అతడి ప్యానల్ రెడీ అయిపోయింది. ప్రకాష్ రాజ్ తన ప్యానల్ కు సిని'మా' బిడ్డల ప్యానెల్ అని నామకరణం చేశారు.

ఊహించని విధంగా చాలా మంది ప్రముఖుల మద్దతు ప్రకాష్ రాజ్ కు తోడైంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులని గమనిస్తే ఆ విషయం అర్థం అవుతుంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో సీనియర్ నటి జయసుధ, హీరో శ్రీకాంత్, నటుడు బెనర్జీ, సాయి కుమార్, తనీష్, ప్రగతి, యాంకర్ అనసూయ, సన, అనిత చౌదరి , సుధ, అజయ్, నాగినీడు, బ్రహ్మాజీ, రవిప్రకాష్, సమీర్, ఉత్తేజ్, నిర్మాత బండ్ల గణేష్, ఏడిద శ్రీరామ్, శివారెడ్డి, భూపాల్, టార్జాన్, సురేష్ కొండేటి, ఖయ్యుమ్, సుడిగాలి సుధీర్, గోవిందా రావు, శ్రీధర్ రావు సభ్యులుగా ఉన్నారు.

'మా' శ్రేయస్సు దృష్ట్యా, నిర్మాణాత్మక ఆలోచనలని ఆచరణలో పెట్టే దిశగా, నటీనటుల బాగోగుల కోసం సిని'మా' బిడ్డల ప్యానల్ తో రాబోతున్నట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు.

మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, విష్ణు, జీవిత, హేమ పోటీ చేస్తుండగా చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకీ లాంటి సీనియర్ స్టార్స్ మద్దతు ఎవరికి అనేది ఇంకా తేలలేదు. విష్ణు సూపర్ స్టార్ కృష్ణ లాంటి సీనియర్ మోస్ట్ నటుల మద్దతు కోరినట్లు వార్తలైతే వచ్చాయి.

More News

2 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ త్వరలోనే.. తప్పనిసరి అంటున్న ఎయిమ్స్ డైరెక్టర్

కరోనాని అరికట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది.

సూపర్ డూపర్ అంటూ రామ్ ట్వీట్.. లింగుస్వామి మూవీ అప్డేట్!

ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

నాపై ఒత్తిడి చేస్తున్నారు.. విష్ణు, ప్రకాష్ రాజ్, జీవితపై నటి హేమ పోటీ!

'మా' అసోసియేషన్ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అయినప్పటికీ ముందుగానే ఎన్నికల హీట్ టాలీవుడ్ లో మొదలైపోయింది.

రష్మిక కోసం 900 కిమీ ప్రయాణించి.. చివరకు పోలీసులకు చిక్కి..!

తమ అభిమాన తారల కోసం అభిమానులు ఎంతకైనా తెగిస్తారు అనడానికి ఇదొక నిదర్శనం.

హైదరాబాద్ లో నేడు పునః ప్రారంభమైన 'సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రాలు 'వరుడు కావలెను‘, 'నరుడి బ్రతుకు నటన'

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా