ప‌వ‌న్‌తో మ‌ళ్లీ ప‌నిచేయాల‌నుకుంటున్న బాపు బొమ్మ‌

  • IndiaGlitz, [Tuesday,May 05 2020]

క‌న్న‌డ బ్యూటీ ప్ర‌ణీత సుభాష్ క‌రోనా ప్ర‌భావంతో ఇబ్బందులు ప‌డుతున్న పేద‌వారికి ఆహారాన్ని అందిస్తుంది. ఆహారాన్ని త‌యారు చేసి స్వ‌యంగా ఆమె పేద‌వారికి పంచుతుండ‌టం విశేషం. లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్ర‌ణీత చేస్తున్న సేవ‌ను అంద‌రూ పొగుడుతున్నారు. తాను ప‌బ్లిసిటీ కోసం ఈ ప‌నుల‌ను చేయ‌డం లేద‌ని ప్ర‌ణీత చెప్పుకొచ్చింది. తాను ఎప్ప‌టినుండో సామాజిక సేవ చేస్తున్నాన‌ని ఆమె తెలిపారు. తాను ఎప్ప‌టి నుండో రెండు స్కూల్స్‌ను ద‌త్త‌త తీసుకున్నాన‌ని వాటికి కావాల్సిన వ‌స‌తుల‌ను క‌లగ‌చేయ‌డంతో తాను ముందుంటున్నానని ఆమె తెలిపారు.

ఇక సినిమాల గురించి ఆమె మాట్లాడుతూ త్వ‌ర‌లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాన‌ని తెలిపారు. ఏకంగా తాను రెండు సినిమాల్లో న‌టించ‌బోతున్నాన‌ని ఆమె తెలిపారు. అజ‌య్ దేవ‌గ‌ణ్‌తో క‌లిసి భుజ్ సినిమాలో న‌టిస్తున్నారు. అలాగే మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరెక్కిస్తోన్న మ‌రో బాలీవుడ్ మూవీలోనూ న‌టించ‌బోతున్నాన‌ని ఆమె తెలిపారు. అత్తారింటికి దారేది త‌ర్వాత త‌న‌కు మంచిరోల్స్ రాలేద‌ని ఆమెతెలిపారు. ప‌వ‌న్‌తో క‌లిసి అత్తారింటికి దారేది సినిమాల న‌టించ‌డాన్నిఎంజాయ్ చేశాన‌ని చెప్పిన ప్ర‌ణీత మ‌రోసారి ప‌వ‌న్‌తో న‌టించే అవకాశం వ‌స్తే త‌ప్ప‌కుండా న‌టిస్తాన‌ని తెలిపారు ప్ర‌ణీత‌.

More News

డైరెక్ట‌ర్‌కు భూ కేటాయింపులు.. స‌ర్కార్‌కు కోర్టు నోటీసులు

తెలంగాణ ప్ర‌భుత్వం సినీ రంగ అభివృద్ధికి చాలా ప్రాముఖ్య‌త ఇస్తుంది. చాలా సంద‌ర్భాల్లో ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం బ‌హిరంగంగానే ప్ర‌క‌టించింది కూడా. తెలంగాణ ద‌ర్శ‌కుడు ఎన్‌.శంక‌ర్‌కు

ప్ర‌భాస్ 20లో ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో పూజా హెగ్డే

బాహుబ‌లి త‌ర్వాత యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నేష‌న‌ల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన సాహో బాలీవుడ్‌, టాలీవుడ్‌లో మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధించింది.

మ‌రోసారి ఆమెతోనే జోడీ క‌డుతున్న నితిన్‌

యువ క‌థానాయ‌కుడు నితిన్ చాలా గ్యాప్ తీసుకుని భీష్మ సినిమా చేశాడు. ఈ సినిమా ఈ ఏడాది విడుద‌లై మంచి స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు.

ఏపీలో మందుబాబులకు మరో భారీ షాక్.. పెరిగిన ధరలు ఇవీ...

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో 3.0 లాక్‌డౌన్‌లో భాగంగా మద్యం అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే.

టాలీవుడ్‌కు త్వరలో మంచి రోజులొస్తాయ్.. : మంత్రి తలసాని

టాలీవుడ్ ఇండస్ట్రీకి త్వరలోనే మంచి రోజులొస్తాయని సినిమాటోగ్రాఫర్ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. మంగళవారం నాడు నగరంలోని ఫిల్మ్ ఛాంబర్ మీడియా మీట్ నిర్వహించిన