సీనియ‌ర్ నిర్మాత రాఘ‌వ క‌న్నుమూత‌

  • IndiaGlitz, [Tuesday,July 31 2018]

ప్ర‌తాప్ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత, ప్ర‌ముఖ నిర్మాత కోటిప‌ల్లి రాఘ‌వ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని ఆయ‌న స్వ‌గృహంలో గుండెపోటుతో క‌న్నుమూశారు. తూర్పు గోదావ‌రి జిల్లా కోటిప‌ల్లి గ్రామంలో 1913 డిసెంబ‌ర్ 9న ఈయ‌న జ‌న్మించారు. 30 పైగా చిత్రాల‌కు రాఘ‌వ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. 'తాత మ‌న‌వ‌డు, సంసారం సాగ‌రం' చిత్రాల‌కు నంది అవార్డుల‌ను కూడా అందుకున్నారు.

ర‌ఘుప‌తి వెంక‌య్య‌, అక్కినేని జీవిత సాఫ‌ల్య పుర‌స్కారాలు ఈయ‌న సొంతం. ద‌ర్శ‌కర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు, కోడిరామ‌కృష్ణ‌, రావు గోపాల‌రావు, ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం, సుమ‌న్‌, బానుచంద‌ర్ వంటి వారిని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన నిర్మాత ఈయ‌నే. జూబ్లీహిల్స్‌లోని మ‌హా ప్ర‌స్థానంలో అంత్ర‌క్రియ‌లు జ‌రుగ‌నున్నాయి.

More News

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'ప్రేమకు రెయిన్ చెక్'

ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం "ప్రేమ రెయిన్ చెక్".

కంగ‌నా సినిమాలు తెలుగులో...

బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఈ రెండు సినిమాల‌ను తెలుగు డైరెక్ట‌ర్సే చేస్తుండ‌టం విశేషం.

చాలెంజ్ పూర్తి చేసిన మ‌హేశ్‌...

తెలంగాణ ప్ర‌భుత్వం ప్రెస్టీజియ‌స్‌గా నిర్వ‌హిస్తున్న హ‌రిత హారం కార్య‌క్ర‌మం ఇప్పుడు చాలెంజ్‌లా మారి సెల‌బ్రిటీలు అంద‌రూ ఆ చాలెంజ్‌ను స్వీక‌రించి మొక్క‌లు నాటుతున్నారు.

ప‌వ‌న్ రీమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న త‌మిళ సంస్థ‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కల్యాణ్ హీరోగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో 2013లో రూపొందిన చిత్రం 'అత్తారింటికి దారేది'.

ఫ్యాన్సీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న చైతు చిత్రం

'ప్రేమ‌మ్' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.