శిల్పా బాధితుల్లో మహేశ్ బాబు చెల్లెలు... పోలీసులకు ఫిర్యాదు, ఉలిక్కిపడ్డ టాలీవుడ్

  • IndiaGlitz, [Thursday,December 02 2021]

కిట్టి పార్టీల పేరుతో సినీ, రాజకీయ ప్రముఖులను పరిచయం చేసుకుని వారి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన శిల్పాచౌదరి బాగోతంతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఈ క్రమంలో శిల్ప.. దాదాపు రూ.200 కోట్ల దాకా కుచ్చు టోపీ పెట్టినట్లుగా పోలీసులు చెబుతున్నారు.హై ప్రొఫైల్ వ్యక్తులు బాధితులుగా వుండటంతో అత్యున్నత స్థాయిలో దర్యాప్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే రోజులు గడిచేకొద్ది శిల్పా చౌదరి బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో సూపర్‌స్టార్ మహేశ్ బాబు సోదరి, హీరో సుధీర్ బాబు సతీమణి ప్రియదర్శిని కూడా చేరారు.

శిల్పా చౌదరి తనకు రూ.2.9 కోట్లు ఎగ్గొట్టారంటూ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ప్రియదర్శిణి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ కిట్టి పార్టీలో శిల్ప తనకు పరిచయమైందని ఆమె వెల్లడించారు. డబ్బు కోసమే ఆమె ప్రతి వీకెండ్‌లో కిట్టి పార్టీ ఏర్పాటు చేసేదని ప్రియదర్శిని చెప్పారు. దీంతో టాలీవుడ్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. శిల్ప వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడే పలువురు టాప్ సినీ సెలబ్రెటీలు ఆమె వలలో చిక్కుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వారి గురించి పోలీసులు బయటకు చెప్పలేదు. ఇప్పుడు ఏకంగా మహేశ్ చెల్లెలు తనకు తానుగా తెరపైకి రావడంతో ..ఇంకెంత మంది రాబోయే రోజుల్లో వెలుగులోకి వస్తారోనన్న ఉత్కంఠ మొదలైంది.

More News

మ‌హేష్ బాబుకి స‌ర్జ‌రీ.. ‘‘సర్కార్ వారి పాట’’కి కొద్దిరోజుల పాటు బ్రేక్

సూపర్‌స్టార్ మహేశ్ బాబు సర్జరీ చేయించుకోనున్నారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో .. మహేశ్ 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: సన్నీ ఎటాకింగ్‌కి వణికిన సిరి, శ్రీరామ్, పింకీ... చివరికి నడవలేని స్ధితికి, డాక్టర్ ట్రీట్‌మెంట్

బిగ్‌బాస్ 5 తెలుగు తుది అంకానికి చేరుకోవడంతో ఫైనల్ బెర్త్‌ల కోసం టాస్క్‌లు మొదలయ్యాయి.

ఏపీ వరదలు: ఎట్టకేలకు కదిలిన టాలీవుడ్.. తలో రూ.25 లక్షలు ప్రకటించిన ఎన్టీఆర్, చిరంజీవి, మహేశ్, చెర్రీ

వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ కొద్దిరోజుల క్రితం చివురుటాకులా వణికిపోయిన సంగతి తెలిసిందే.

కరోనా నుంచి కోలుకున్న కమల్ హాసన్... హెల్త్ బులెటిన్ విడుదల

కరోనా వైరస్ బారినపడిన విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ కోలుకున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. యాక్సిడెంట్‌లో హీరో సోదరుడు దుర్మరణం

టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో ముగ్గురు ప్రముఖులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.