close
Choose your channels

ప్రియమణి వివాహం చెల్లదు.. ఆమె భర్త మొదటి భార్య షాకింగ్ కామెంట్స్!

Thursday, July 22, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క్రేజీ హీరోయిన్ ప్రియమణి, ముస్తఫా రాజ్ ల వివాహం వివాదంగా మారింది. ముస్తఫా రాజ్ మొదటి భార్య ఆయేషా తాజాగా మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేసింది. ప్రియమణి కంటే ముందుగా ముస్తఫా రాజ్.. ఆయేషాని వివాహం చేసుకున్నాడు. 2010లో వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 

వీరి వైవాహిక జీవితంలో విభేదాలు రావడంతో విడిపోయి బతుకుతున్నారు. ముస్తఫా తన పిల్లల కోసం ప్రతి నెల డబ్బు పంపుతున్నాడట. తన భర్త పిల్లలని సరిగ్గా పట్టించుకోవడం లేదని ఆయేషా మీడియా ముందు వాపోయింది. ప్రియమణితో పెళ్లయ్యాక పూర్తిగా పట్టించుకోవడం మానేశాడని ఆరోపిస్తోంది. 

తనని ముస్తఫా గతంలో హింసించాడని కూడా అయేషా మీడియా ముందు తెలిపింది. ప్రియమణి, ముస్తఫా వివాహం చెల్లదని..వారిది అక్రమ వివాహం అని ఆయేషా సంచలన ఆరోపణలు చేసింది. తాను ముస్తఫాకు మాజీ భార్యని కాను అని.. ఇప్పటికి అతడి భార్యనే అని ఆయేషా అంటోంది. ముస్తఫా, ప్రియమణి వివాహం జరిగే సమయానికి మేమిద్దరం కనీసం విడాకులకు దరఖాస్తు కూడా చేసుకోలేదు అని ఆయేషా అంటోంది. 

అలాంటప్పుడు ఆ వివాహం ఎలా చెల్లుతుంది అని ప్రశ్నించింది. ఇద్దరు బిడ్డల తల్లిగా అడుగుతున్నాను.. నా స్థానంలో ఉండి ఆలోచించండి అని కోరింది. దీనిపై ముస్తఫా స్పందిస్తూ.. ఆమె తనపై అనవసర ఆరోపణలు చేస్తోంది అని అన్నాడు. ప్రతి నెల నేను పిల్లలకు డబ్బు పంపుతూనే ఉన్నాను.కానీ ఆయేషా నా నుంచి ఎక్కువ డబ్బు కాజేయాలని చూస్తోంది. నేను హింసించినట్లు మాట్లాడింది. నేను అలాంటి వ్యక్తినే అయితే ముందే ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేదు అని ముస్తఫా ప్రశ్నించాడు. 

మొత్తంగా వీరిద్దరి వివాదంతో ప్రియమణి కూడా వార్తల్లో నిలిచింది. ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ 2తో ఘనవిజయం సొంతం చేసుకుంది. వెంకటేష్ సరసన నటించిన నారప్ప చిత్రం కూడా జూలై 20న విడుదలై మంచిస్పందన అందుకుంటోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.