విజయ్ సినిమాను భారీ మొత్తంలో సొంతం చేసుకున్న తెలుగు నిర్మాత

  • IndiaGlitz, [Sunday,December 29 2019]

ఒకప్పుడు సూర్య, విక్రమ్ లాంటి కోలీవుడ్ హీరోలకు తెలుగులో మంచి మార్కెట్ ఉండేది. గజినీతో సూర్య, అపరిచితుడుతో విక్రమ్... తమ మార్కెట్‌ను అమాంతం పెంచేసుకున్నారు. ఇక రజినీ, కమల్ విషయం చెప్పాల్సిన పని లేదు. వాళ్లకు మొదటి నుంచి తెలుగులో చెప్పుకోదగ్గ స్థాయిలో అభిమానులు ఉండటంతో.. వారి మార్కెట్‌కు ఎప్పటిలానే ఉంది. తాజాగా ఈ జాబితాలో హీరో విజయ్ చేరాడు. ‘అదిరింది’, ‘సర్కార్’ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇటీవల విడుదలైన బిగిల్.. తెలుగులో విజిల్‌గా రిలీజైంది. మహేశ్ కోనేరు రూ.9.5 కోట్లకు ఈ సినిమా హక్కులను పొంది.. తెలుగులో రిలీజ్ చేశాడు. విజయ్ కెరీర్‌లో తెలుగులో అమ్ముడైన సినిమా ఇది. విజయ్ తర్వాత స్థానాల్లో కార్తి, విజయ్ సేతుపతి ఉన్నారు. కార్తి సినిమాలు తమిళ్, తెలుగు భాషల్లో రూపొందడం.. ఇక్కడా విజయం సాధించడం.. తెలిసిన విషయమే. తాజాగా విడుదలైన ఖైదీ, దొంగ సినిమాలు.. ఆయనకు స్థిరమైన మార్కెట్‌ను ఏర్పరిచాయి. ఇదీ కోలీవుడ్ స్టార్ హీరోల తెలుగు మార్కెట్ పరిస్థితి.

ఇక అసలు విషయానికొస్తే.. విజయ్ తన తదుపరి చిత్రాన్ని ఖైదీ ఫేమ్ లోకేశ్ కనగరాజ్‌తో చేస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ సేతుపతి .. మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తెలుగులో ఈ సినిమా హక్కులను మహేశ్ కోనేరు రూ.8.5 కోట్లకు సొంతం చేసుకున్నాడు.

More News

రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న రానా

రానా దగ్గుబాటి.. పర్ఫెక్షన్ కోసం ఆరాటపడే నటుడు. పాత్రకు తగ్గట్టుగా తనను తాను మలుచుకోవడానికి తాపత్రయ పడుతుంటాడు. బాహుబలి సినిమానే దీనికి పెద్ద ఉదాహరణ. ఆ సినిమాలో భల్లాలదేవ పాత్ర కోసం పూర్తిగా...

దిల్‌రాజు హ్యాపీగా లేడా?

ఒక‌ప్పుడు స్టార్ హీరోలంద‌రినీ డైరెక్ట‌ర్ చేసి స్టార్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు వి.వి.వినాయ‌క్‌. ఈయ‌న ఇప్పుడు `శీన‌య్య`

సీపీ అంజనీకుమార్‌కు ఉత్తమ్ వార్నింగ్.. ఏం జరిగింది!?

సినీ ఫక్కీలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

కీరవాణి, రాజమౌళి మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం: నిర్మాతలు రవిశంకర్, చెర్రి (చిరంజీవి)

మత్తువదలరా విషయంలో కథ బాగుంది సినిమా తీద్ధాం అని నిర్ణయం తీసుకోవడం తప్పితే ఈ రోజు సినిమా విజయంలో

మందు తాగి ర‌చ్చ చేసిన హీరోయిన్‌

బుజ్జిగాడు మేడిన్ చెన్నై స‌హా ప‌లు తెలుగు చిత్రాల్లో న‌టించి ఆక‌ట్టుకున్న హీరోయిన్ సంజ‌నా గ‌ర్లాని బెంగ‌ళూరులోని ప‌బ్‌లో మ‌ద్యం తాగి ర‌చ్చ ర‌చ్చ చేసింది.