తత్త్వం బోధపడినట్లుందిగా.. ‘ఎఫ్ 3’కి టికెట్ రేట్లు పెంచనన్న దిల్‌రాజు

  • IndiaGlitz, [Wednesday,May 18 2022]

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్ 3 చిత్రం ఈ నెల 27న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఎఫ్ 2 మూవీ సూపర్‌హిట్ కావడం, తాజాగా విడుదల చేసిన టీజర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఎఫ్ 3పై మంచి అంచనాలు వున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత దిల్ రాజు కీలక ప్రకటన చేశారు. సాధారణ ధరలకే ఎఫ్ 3 మూవీని చూసి ఎంజాయ్ చేయాలంటూ ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఆయన విజ్ఞప్తి చేశారు.

సినిమా నిర్మాణ వ్యయం పెరగడం, థియేటర్లకు గిట్టుబాటు కాకపోవడం, కరోనా సంక్షోభం తదితర కారణాలతో ఇటీవలి కాలంలో విడుదలైన అన్ని పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచాయి. అయితే దీని వల్ల సామాన్యుడికి వినోదం భారంగా మారింది. నలుగురు సభ్యులున్న కుటుంబం థియేటర్‌కి సినిమా చూడాలంటే ఎలా లేదన్నా రెండు నుంచి మూడు వేల రూపాయలు వదిలించుకోవాల్సిందే. దీంతో మధ్య తరగతి, నిరుపేద కుటుంబాలు సినిమాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు.

సెమి అర్బన్, రూరల్ ఏరియాలలో రూ. 100-150 మధ్య టికెట్ దొరుకుతుండగా.. నగరాలు, పట్టణాలలో దీని ధర రూ.250 నుంచి రూ.500 మధ్య వుంటోంది. అంటే నెలలో రెండు , మూడు సార్లు సినిమాకి వెళితే సంసారం నడపడం కష్టమనే భావన ప్రేక్షకుల్లో కలుగుతోంది. దీని వల్ల సినిమాకు మహారాజ పోషకులైన ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్‌కు రావడం మానేశారు. ఓటీటీలోనో, టీవీల్లో వేసినప్పుడు చూడొచ్చులే అన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ఇటీవల విడుదలైన సినిమాల విషయంలో ఈ విషయం కొట్టొచ్చినట్లు కనిపించింది. అనుభవమైతే కానీ తత్త్వం బోధపడదు అన్నట్లు ఈ చిత్రాల ఫలితంతోనే మెగా ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఆలోచనలో పడ్డారు. దీనిలో భాగంగానే ఎఫ్ 3 సినిమాకు టికెట్ రేట్లు పెంచాలనే ఆలోచనను విరమించుకున్నారు. ఆయన నిర్ణయంతో ప్రేక్షకులు ఖుషి అవుతున్నారు.

More News

అలీకి హ్యాండిచ్చిన జగన్.. వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులు వీరే, అనూహ్యంగా తెరపైకి ఆర్.కృష్ణయ్య

ఆంధ్రప్రదేశ్‌ నుంచి త్వరలో ఖాళీకానున్న రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్ధులను ఖరారు చేశారు ఆ పార్టీ అధినేత,

రైజింగ్‌లో పవన్ గ్రాఫ్.. కడుపు మంటతోనే దత్తపుత్రుడంటూ వ్యాఖ్యలు : జగన్‌పై జనసేన నేత విజయ్ కుమార్ ఆగ్రహం

వైసీపీ ప్రభుత్వంపై, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరు విజయ్ కుమార్.

USA వర్జీనియా లో విజయవంతంగా జరిగిన "ఆటా" క్యారం బోర్డ్, టేబుల్ టెన్నిస్ పోటీలు

వాషింగ్టన్ DCలో జూలై 1 నుండి జూలై 3 వరకు జరగనున్న ATA కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ సందర్భంగా, 17వ ATA కన్వెన్షన్ టీమ్ మే 14  తేదీ లో

చిత్రీకరణ తుది దశకు రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ చిత్రం

రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా ఓ కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు.

త‌నికెళ్ళ భ‌ర‌ణి చేతుల మీదుగా "పుడిమిని త‌డిపే తొల‌క‌రి మెరుపుల‌ చినుక‌మ్మా .. సాంగ్ విడుద‌ల‌

హుషారు లాంటి సూప‌ర్‌హిట్ చిత్రం లో న‌టించిన తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ జంట‌గా వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వం లో