కొడుకుని హీరోగా ప‌రిచ‌యం చేస్తున్న నిర్మాత‌

  • IndiaGlitz, [Monday,June 25 2018]

తెలుగు తెర‌ పై మ‌రో ప్ర‌ముఖ నిర్మాత త‌న‌యుడు క‌థానాయ‌కుడిగా ప‌ల‌క‌రించ‌నున్నారు. ఆ నిర్మాత మ‌రెవ‌రో కాదు.. భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తున్న డి.వి.వి.దాన‌య్య‌. ఇటీవ‌లే భ‌ర‌త్ అనే నేనుతో హిట్ కొట్టిన ఈ నిర్మాత‌.. ప్ర‌స్తుతం మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా నిర్మిస్తున్నారు.

అలాగే దర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేశారు. అంతేగాకుండా.. త‌న త‌న‌యుడిని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నార‌ట డి.వి.వి.దాన‌య్య‌.

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌ని ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు కూడా జ‌రుగుతున్నాయ‌ట‌. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన‌ పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

More News

ర‌జ‌నీకాంత్ కోసం బాలు పాట‌

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ప‌లు సినిమాల కోసం గాన గాంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం గాత్రం అందించారు.

మ‌హేష్ రూమ్ మేట్‌గా..

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

క‌లిసొచ్చిన సంగీత ద‌ర్శకుడితో నాగ‌శౌర్య వ‌రుస చిత్రాలు

''చూసి చూడంగానే న‌చ్చేశావే.. అడిగి అడంగానే వ‌చ్చేశావే.. నా గుండెల్లోకి..'' అంటూ సాగే 'ఛ‌లో' చిత్రంలోని పాట ఎంత పెద్ద హిట్టో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

వ‌రుణ్ తేజ్‌కిదే తొలిసారి..

మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలను చెప్పుకోవచ్చు.

'ఆయుష్మాన్ భవ' టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్

చ‌ర‌ణ్ తేజ్ హీరోగా స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో. నేను లోక‌ల్ చిత్ర ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన స్టోరి, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో