టాలీవుడ్‌లో మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువ నిర్మాత మృతి

  • IndiaGlitz, [Friday,December 03 2021]

టాలీవుడ్‌లో వ‌రుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల వ్య‌వ‌ధిలోనే దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు, సీనియర్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్, ఆ మ‌రుస‌టి రోజే ప్ర‌ముఖ తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఆ తర్వాతి రోజు హీరో కిరణ్ అబ్బవరం సోదరుడు రామాంజులు రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలు కళ్లెదుట మెదులుతుండగానే టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది.

నిర్మాత‌ జక్కుల నాగేశ్వరరావు (46) రోడ్డు ప్రమాదంలో మరణించారు. కృష్ణా జిల్లా ఉయ్యురు మండలం మంటాడలో ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో జక్కుల సంఘటనా స్థలంలోనే మృతిచెందినట్లు తెలుస్తోంది. ‘లవ్ జర్నీ’, ‘అమ్మా నాన్న ఊరెళితే’, ‘వీడు సరైనోడు’ చిత్రాల‌కు నిర్మాత గా వ్య‌వ‌హ‌రించారు. నిర్మాత మృతి పట్ల పలువురు సీని, ప్రముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.

More News

భారత్‌లో అడుగుపెట్టిన ‘‘ఒమిక్రాన్’’.. కర్ణాటకలో రెండు కేసులు గుర్తింపు, కేంద్రం అప్రమత్తం

అనుకున్నదంతా అయ్యింది ప్రపంచాన్ని కలవరపెడుతోన్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోకి అడుగుపెట్టింది.

'పంచనామ' టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్

గద్దె శివకృష్ణ మరియు వెలగ రాము సంయుక్తంగా నిర్మిస్తున్న హార్దిక్ క్రియేషన్స్ బ్యానర్ పై సిగటాపు రమేష్ నాయుడు దర్శకత్వంలో

'రామ్ అసుర్' సినిమాతో నటుడిగా  మంచి గుర్తింపు వచ్చింది: అభినవ్ సర్దార్

విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుంటున్న అభినవ్ సర్దార్ ఇటీవల విడుదలైన 'రామ్ అసుర్' తన కెరీర్‌లో బిగ్ సక్సెస్ అందుకున్నారు.

శిల్పా బాధితుల్లో మహేశ్ బాబు చెల్లెలు... పోలీసులకు ఫిర్యాదు, ఉలిక్కిపడ్డ టాలీవుడ్

కిట్టి పార్టీల పేరుతో సినీ, రాజకీయ ప్రముఖులను పరిచయం చేసుకుని వారి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన శిల్పాచౌదరి బాగోతంతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి.

మ‌హేష్ బాబుకి స‌ర్జ‌రీ.. ‘‘సర్కార్ వారి పాట’’కి కొద్దిరోజుల పాటు బ్రేక్

సూపర్‌స్టార్ మహేశ్ బాబు సర్జరీ చేయించుకోనున్నారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో .. మహేశ్ 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.