‘జాతిరత్నాలు’ నిర్మాతకు ఎంత లాభం తెచ్చిపెట్టిందంటే..

  • IndiaGlitz, [Monday,April 12 2021]

లాక్‌డౌన్ తర్వాత మరీ ముఖ్యంగా చెప్పాలంటే మార్చి నెలలో ప్రేక్షకులను ఓ రేంజ్‌లో అలరించిన చిత్రం ‘జాతిరత్నాలు’. నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలుగా నటించిన చిత్రం 'జాతిరత్నాలు'. అనుదీప్‌ కేవీ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రాన్ని మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ నిర్మించారు. జనాలు కరోనా భయాన్ని వీడి పూర్తి స్థాయిలో బయటకు వచ్చి ఒక చిత్రాన్ని చూశారంటే.. అది ఈ సినిమానే అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. నిర్మాతలు తమ తమ సినిమాలను ధైర్యంగా విడుదల చేసేందుకు ఈ సినిమా మార్గం చూపించిందనే చెప్పాలి. ఈ చిత్రం నేటి(ఆదివారం) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉండనుంది.

ఈ సినిమాను బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టి నిర్మాతలపై వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా క్లోజింగ్ వసూళ్లు షాకింగ్ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలుపుకుని రూ.10 కోట్లకు పైగా థియేట్రికల్‌ బిజినెస్‌ జరుపుకుంది. ఇక రిలీజైన తొలి రోజు నుంచే మంచి టాక్‌ రావడంతో కొద్ది రోజులపాటు బాక్సాఫీస్‌ దగ్గర దుమ్ము రేపింది. థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.10 కోట్ల పైమాటే ఉండటంతో బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ పదకొండున్నర కోట్లుగా నమోదైంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.39 కోట్లకు పైమాటే వసూలు చేసింది. దీంతో ఈ సినిమా ఇరవై ఏడున్నర కోట్ల లాభాలను అందుకుంది.

‘జాతిరత్నాలు’ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..

నైజాం రూ.16.18 కోట్లు

సీడెడ్‌ రూ.4.10 కోట్లు

ఈస్ట్‌ రూ.1.92 కోట్లు

వెస్ట్‌ రూ.1.58 కోట్లు,

కృష్ణా రూ.1.81కోట్లు

గుంటూరు రూ.2.08 కోట్లు

నెల్లూరు రూ.92 లక్షలు

ఏపీ+తెలంగాణ రూ. 32.59 కోట్లు షేర్‌, రూ.52 కోట్ల గ్రాస్‌

వరల్డ్ వైడ్ రూ.39.04 కోట్ల షేర్‌, రూ.70 కోట్ల గ్రాస్‌

More News

వైసీపీ ఓడితే ఎంపీలంతా రాజీనామా చేస్తారు: పెద్దిరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు విసిరిన రెఫరెండం సవాల్‌ను మంత్రి పెద్దిరెడ్డి స్వీకరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

క్వారంటైన్‌లో పవన్..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ మొదటి దశ కంటే అత్యంత వేగంగా విస్తరిస్తోంది.

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్.. మెగాస్టార్, రానా చిత్రాలకు షాక్..

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆచార్య’, రానా దగ్గుబాటి ‘విరాటపర్వం’సినిమాలకు బిగ్‌ షాక్‌ తగిలింది.

కరోనాతో ప్రముఖ నటుడి మృతి

సీనియర్ నటుడు,‘మహాభారతం’ సీరియల్‌ ఫేమ్‌ సతీష్ కౌల్(66) కరోనా బారిన పడి మృతి చెందారు.

‘వకీల్ సాబ్‌’కు హైకోర్టు షాక్...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్’. శుక్రవారం విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో నడుస్తోంది.