నిర్మాత రిక్వెస్ట్.. మారుతి వెబ్ సిరీస్‌

  • IndiaGlitz, [Saturday,May 23 2020]

ఓటీటీ మాధ్య‌మాలు జోరును ముందుగానే ఊహించిన తెలుగు నిర్మాత‌ల్లో అల్లు అర‌వింద్ ఒక‌రు. అందుక‌నే ఆయ‌న తెలుగులో ఆహా అనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసి తీసుకొచ్చారు. ఇందులో చాలా మందిని పార్ట‌న‌ర్స్‌గా చేర్చుకున్నారు. ఆహా కంటెంట్‌లో ద‌ర్శ‌కుడు క్రిష్ కీల‌క భూమిక పోషిస్తున్నాడు. అయితే అర‌వింద్ ఆశించిన స్థాయి కంటే ఎక్కువ రెస్పాన్స్ రావ‌డం లేద‌ట. దీంతో సినిమా రంగానికి చెందిన ప‌లువురు ద‌ర్శ‌కులను కంటెంట్ క‌న్‌స‌ల్‌టెంట్స్‌గా ఉప‌యోగించుకోవాల‌ని అర‌వింద్ ప్లాన్స్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా రంగంలో కొంత మంది ద‌ర్శ‌కుల‌తో ఇప్ప‌టికే అల్లు అర‌వింద్ చ‌ర్చ‌లు జ‌రిపారని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వంశీ పైడిప‌ల్లి, చంద్ర‌సిద్ధార్థ్‌, నందినీరెడ్డి, విఐ.ఆనంద్‌ల‌ను కంటెంట్ క‌న్‌స‌ల్‌టెంట్స్‌గా నియ‌మించుకున్నార‌ని, వీరంద‌రూ ఇప్ప‌టికే త‌మ సర్కిల్‌లోని త‌మ‌కు తెలిసి మంచి కంటెంట్ అందించే ర‌చ‌యిత‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారని టాక్.

కాగా లేటెస్ట్ సమాచారం మేరకు డైరెక్టర్ మారుతితో అరవింద్ చర్చలు జరిపారట. ఆహా కోసం మంచి కంటెంట్తో వెబ్ సిరీస్ చేయమని కోరారట అరవింద్. కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో షూటింగ్‌లు ఎప్ప‌టి నుండి జ‌రుగుతాయో తెలియ‌కుండా ఉన్నాయి. దీంతో ఈ గ్యాప్‌లో మారుతి ఆహా కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై మారుతి ఏమైనా స్పందిస్తారేమో వేచి చూడాలి.