దర్శకుడిగా మారుతున్న నిర్మాత విశ్వనాథ్ తన్నీరు

  • IndiaGlitz, [Tuesday,January 28 2020]

సినీ నిర్మాత విశ్వనాధ్ తన్నీరు ఇటీవల యమ్ 6 వంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించి మంచి పేరు తెచ్చుకున్నారు, ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 2 గా ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు.

ఈ సందర్భంగా విశ్వనాధ్ తన్నీరు మాట్లాడుతూ.... ఈ క్రొత్త ప్రాజెక్ట్ విశేషాలను తెలియజేసారు సినిమా మీద ప్యాషన్ తో ఈరంగం లోకి వచ్చిన నేను యమ్ 6 సినిమా తో నిర్మాతగా మారా . ఐతే నాకు దర్శకుడు కావాలనే కోరిక ఎప్పట్నుంచో ఉంది . ఈ క్రమంలో ఎన్నో కథలు విన్నా . చివరకు ఓ అద్భుతమయిన కథ దొరికింది . కంటెంట్ ఆధారం గా నిర్మితమవుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది . అలాగే ఈ సినిమా ద్వారా సమాజానికి ఒక మంచి మెసేజ్ కూడా ఇస్తున్నాం . ముఖ్యంగా ఈ చిత్రం లోని క్లైమాక్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది . ఈ సినిమా లో హీరోగా మా గత చిత్రం యమ్ 6 లో హీరో గా చేసిన ధ్రువ ను ఎంపిక చేసాం. తనలో మంచి టాలెంట్ ఉంది . ఈ క్యారెక్టర్ కి తను బాగా మ్యాచ్ అవుతాడు . ఈ సినిమా ఫిబ్రవరి నెల మొదటి వారం హైదరాబాద్, రెండో షెడ్యూల్ వైజాగ్, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కంప్లీట్ చేస్తాము. ఇలా 4 షెడ్యూల్స్ లో సినిమా మొత్తం కంప్లీట్ చేస్తాం అన్నారు . రాగిణి, డి.యస్ .రావు , గురురాజ్ , నామాల రవీంద్ర సూరి , మాస్టర్ జైనీత్ , దిల్ రమేష్ ,శివమ్ శివరాత్రి, గిరి , తిలక్ , నర్సిరెడ్డి , చంటి , సందీప్ , కుమరం మొదలగువారు నటిస్తున్నారని తెలిపారు.

హీరో ధ్రువ మాట్లాడుతూ... M6 సినిమాతో నన్ను హీరోగా పరిచయం చేసిన విశ్వనాధ్ గారికి ధన్యవాదాలు. ఆయన దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా ఇది, నాకు రెండో సారి ఈ వినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాతో నేను మరింత పేరు తెచ్చుకొని ప్రేక్షకుల ఆదరణ పొందుతాను. ఫిబ్రవరి మొదటివారంలో షూటింగ్ కు వెళ్లి కంటిన్యూటి షెడ్యూల్ లో షూట్ కంప్లీట్ చెయ్యబోతున్నాము అన్నారు.

ఆర్టిస్ట్స్: హీరో ధ్రువ, రాగిణి, డి.యస్ .రావు , గురురాజ్ , నామాల రవీంద్ర సూరి , మాస్టర్ జైనీత్ , దిల్ రమేష్ ,శివమ్ శివరాత్రి, గిరి , తిలక్ , నర్సిరెడ్డి , చంటి , సందీప్ , కుమరం

More News

ఫిబ్రవరి 7న ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా

ఫిబ్రవరిలో ధనుష్ 'లోకల్ బాయ్'

కథానాయకుడిగా ధనుష్‌ది విలక్షణ శైలి. 'రఘువరన్ బీటెక్'లో సగటు మధ్యతరగతి యువకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఎయిర్ ఇండియా అమ్మ‌కం.. స్వ‌ప‌క్షంలోనే మోడీపై విమ‌ర్శలు

ప్ర‌భుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా అప్పుల భారంతో కూరుకుపోయింది. దీంతో సంస్థ‌ను పూర్తిగా విక్ర‌యించాల‌నుకుటున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం సోమ‌వారం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది.

హైకోర్టుని ఆశ్ర‌యించిన సీఎం జ‌గ‌న్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో వ్య‌క్తిగ‌త హాజ‌రు నుండి మిన‌హాయింపు కోరుతూ తెలంగాణ హైకోర్టుని ఆశ్ర‌యించారు.

మనందరిలో `అశ్వథ్థామ` ఉంటాడు - మెహరీన్‌

ఈ ఏడాది జనవరిలో ‘ఎంతమంచివాడవురా’, ‘పటాస్‌' చిత్రాలతో లో మన ముందుకు వచ్చిన మెహరీన్‌..జనవరి చివరి వారంలో ‘అశ్వథ్థామ