నాగ‌శౌర్య సినిమా ఆగిపోలేదు: నిర్మాత‌లు

  • IndiaGlitz, [Wednesday,February 26 2020]

యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య‌, శ్రీనివాస్ అవ‌స‌రాల కాంబినేష‌న్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై ఓ సినిమా కొన్ని రోజుల ముందు స్టార్ట్ అయ్యింది. దాదాపు 50 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవ‌ల యు.ఎస్‌లో కొంత మేర చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకోవాల్సి ఉంది. అయితే రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ బ‌డ్జెట్ ఎక్కువ అవుతుంద‌నే కార‌ణంతో ఆగిపోయిందంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపించాయి. అయితే ఈ వార్త‌ల‌పై నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా, నిర్మాత వివేక్ కూచిబొట్ల స్పందించారు.

''నాగ‌శౌర్య సినిమా ఆగిపోలేదు. సోష‌ల్ మీడియాలో సినిమా ఆగిపోయింద‌టూ వ‌స్తున్న క‌థ‌నాల్లో నిజం లేదు. ఇప్పటి వ‌ర‌కు సినిమా 50 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. మిగిలి భాగాన్ని అమెరికాలో చిత్రీక‌రించాల్సి ఉంది. వీసాల కోసం వేచి చూస్తున్నాం. సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు చ‌క్క‌గా వ‌చ్చింది'' అన్నారు వివేక్ కూచిబొట్ల‌. అశ్వ‌థ్థామ ఫ్లాప్ త‌ర్వాత నాగ‌శౌర్య త‌దుప‌రి సినిమాల ఎంపిక‌లో జాగ్ర‌త్త‌లు వ‌హిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా ఈ యువ హీరో చేతిలో మ‌రో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ సినిమాల‌పైనే నాగ‌శౌర్య ఆశ‌ల‌ను పెట్టుకున్నాడు.

More News

క‌వ‌ల‌లుగా బాల‌య్య‌

నంద‌మూరి బాల‌కృష్ణ 106వ చిత్రం మార్చి నుండి ప్రారంభం కానుంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

రెండు ప్రేమ‌క‌థ‌లు..పున‌ర్జ‌న్మ‌ల‌తో నాని 27

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. రీసెంట్‌గానే త‌న 25వ సినిమా `వి`ను పూర్తి చేశాడో లేదో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా త‌న 26వ సినిమాకు రెడీ అయిపోయాడు.

చంద్రబాబును జగన్ ఓడించారని ట్రంప్‌కు కోపం!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే..

పూరితో ప‌వ‌ర్‌స్టార్‌..?

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తున్నాడు.

నిర్మాత‌గా మారుతున్న చైత‌న్య‌

అక్కినేని వార‌సుల్లో మూడో త‌రం హీరోలుగా అక్కినేని చైత‌న్య‌, అఖిల్ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితులే.