థియేటర్లు తెరిచేందుకు చర్యలు చేపట్టిన ప్రొడ్యూసర్స్ గిల్డ్..

  • IndiaGlitz, [Monday,November 30 2020]

కరోనా మహమ్మారి మూలంగా విపరీతంగా నష్టపోయిన పరిశ్రమలో చిత్ర పరిశ్రమ ఒకటి. ఇప్పటికీ థియేటర్లు ప్రారంభానికి నోచుకోలేదు. ప్రభుత్వం సానుకూల వాతావరణం కల్పించినప్పటికీ సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు సైతం ముందుకు రాకపోవడంతో థియేటర్లు నేటికీ తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలోనే థియేటర్లు మళ్లీ ప్రారంభించించేందుకు యాక్టివ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ అన్ని చర్యలూ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలకు భారం తగ్గేలా.. మల్టీప్లెక్స్ సంస్థలు పూనుకోవాలని గిల్డ్ కోరింది.

మల్టీప్లెక్స్ థియేటర్ల ముందు గిల్డ్ పెట్టిన ప్రతిపాదనలివే..

రెవెన్యూ షేరింగ్... ఇప్పటివరకు ఉన్న 55:45 (మొదటివారం), 45:55 (రెండో వారం), 40:60 (మూడో వారం), 35:65 (నాలుగో వారం) పద్దతిని పక్కన పెట్టి 60:40 (నిర్మాతలకు 60 శాతం), 50:50 (రెండో వారం), 40:60 (మూడో వారం)... పద్ధతిలో నిర్మాతలకు ఎక్కువ రెవెన్యూ వచ్చేలా ఉండాలి.

రెవెన్యూ షేరింగ్ ... తెలుగు రాష్ట్రాల్లో అంతటా ఒకే తీరుగా ఉండాలి.

నిర్మాతల నుంచి ఇకపై వర్చువల్ ప్రింట్ ఫీ(వీపీఎఫ్) వసూల్ చెయ్యకూడదు.

థియేటర్లో వేసే సినిమా ట్రైలర్స్ కి డబ్బులు వసూల్ చెయ్యకూడదు. థియేటర్ ఆవరణలో పెట్టే పోస్టర్లు, ఇతర మెటీరియల్స్ కి రుసుము అడగొద్దు.

షో ప్రయారిటీ తెలుగు సినిమాలకే ఇవ్వాలి.

కాంబో టిక్కెట్లు అమ్మవద్దు

మెయింటెనెన్స్ ఛార్జీలు నిర్మాతల నుంచి తీసుకోవద్దు .

ప్రభుత్వం అధిక షోలకు అనుమతిస్తే... మల్టీప్లెక్స్‌లు పాటించాలి.

More News

నాగశౌర్య, సంతోష్‌ జాగర్లపూడి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం `ల‌క్ష్య`

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే..

మేజ‌ర్ యాక్ష‌న్ షెడ్యూల్‌ను పూర్తి చేసిన ‘ఆర్ఆర్ఆర్‌’ టీమ్‌

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో

రజినీ రాజకీయ రంగ ప్రవేశంపై కొనసాగుతున్న సస్పెన్స్..

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయం రంగ ప్రవేశం దాదాపుగా ఖరారై పోయింది.

‘సోలో బ్రతుకే సో బెటర్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. చిత్రబృందానికి శుభాకాంక్షల వెల్లువ

మెగా హీరో సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. కరోనా మహమ్మారి దెబ్బకు థియేటర్లన్నీ మూతపడ్డాయి.

ఇదే నిజమైతే.. టీఆర్ఎస్ ఖేల్ ఖతమే..

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.