'ప్రాజెక్ట్ z' సెన్సార్ పూర్తి..సెప్టెంబర్ ప్రథమార్థంలో విడుదల

  • IndiaGlitz, [Saturday,August 12 2017]

సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాటి, జాకీష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో సి.వి. కుమార్‌ దర్శకత్వంలో తమిళ్‌లో తెరకెక్కిన మాయావన్‌' చిత్రాన్ని ప్రాజెక్ట్ z' గా ఎస్‌బికె ఫిలింస్‌ కార్పోరేషన్‌లో ఎస్‌.కె. బషీద్‌ సమర్పణలో నిర్మాత ఎస్.కె. కరీమున్నీసా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ ప్రథమార్ధం లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ఎస్‌.కె.బషీద్‌ మాట్లాడుతూ.. ఆద్యంతం ఆసక్తి కలిగించే ఉత్కంఠతతో తెరకెక్కిన తమిళ మాయావన్‌' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు ప్రాజెక్ట్ z' గా మా ఎస్‌బికె ఫిలింస్‌ కార్పోరేషన్‌లో అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సందీప్‌కిషన్‌, లావణ్య త్రిపాటి, జాకీష్రాప్‌లు ఇందులో కీలకమైన పాత్రల్లో నటించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యుల నుండి చాలా పాజిటివ్ టాక్ తో పాటు U/A సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం లో సందీప్ కిషన్ నటనను చూసిన ప్రతి ఒక్కరూ మంత్రముగ్దులవుతారు. అలాగే జాకీష్రాప్‌ పాత్ర ఈ చిత్రానికి మరో హైలెట్ అవుతుంది. ఇక లావణ్య త్రిపాఠి ఇప్పటి వరకు కనిపించని, నటించని విధంగా ఈ సినిమాలో ఆమె పాత్ర ఉంటుంది. సెప్టెంబర్ ప్రథమార్థంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము..అని అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: గిబ్రాన్, డిఓపి: గోపి అమర్నాథ్, ఎడిటర్: లియో జాన్ పాల్, డైలాగ్స్: శశాంక్ వెన్నెలకంటి, ఆర్ట్: గోపి ఆనంద్, సమర్పణ: ఎస్‌.కె. బషీద్‌, నిర్మాత: ఎస్.కె. కరీమున్నీసా, స్టోరీ-దర్శకత్వం: సి.వి. కుమార్.