close
Choose your channels

ప్రాజెక్ట్ z.. అడ్డంకులు తొలగిపోయాయి

Tuesday, November 28, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న తమిళ చిత్రం మాయవన్`. ఇదొక‌ సైన్స్ ఫిక్షన్ క్రైమ్ మిస్టరీ ఫిలిం. దీనిని ప్రాజెక్ట్ z` అనే పేరుతో తెలుగులో డబ్ చేస్తున్నారు.

గత ఏడాదే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా.. విడుదలకు మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు నోచుకోలేదు. ఆర్ధికపరమైన లావాదేవీలే ఈ సినిమా విడుదల ఆలస్యం అవడానికి కారణమని ఈ చిత్ర నిర్మాత, డైరెక్టర్ సి.వి.కుమార్ చెప్పారు. చివరికి ఆ సమస్యలన్నీ అధిగమించి.. ఫైనాన్షియర్స్ దగ్గరనుంచి ఎన్.ఓ.సి. సర్టిఫికేట్ కూడా తీసుకుని ఫిలిం ఛాంబర్లో జమ చేసినట్లు తెలియజేసారు.

ఇక ఈ సినిమా విడుదలకి సంబంధించి అడ్డంకులన్నీ తొలగిపోయినట్లేనని, ప్రీ-రిలీజ్ ప్రమోషన్స్ పనులను మొదలుపెడతామని కుమార్ వెల్లడించారు.

సీనియర్ బాలీవుడ్ యాక్టర్ జాకీ ష్రాఫ్ ప్రధాన విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సందీప్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. జీబ్రాన్ మ్యూజిక్ ని అందిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ని తొందరలోనే వెల్లడించనున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.