బీజేపీలోకి పీటీ ఉష?

  • IndiaGlitz, [Wednesday,February 24 2021]

పరుగుల రాణి పీటీ ఉష రాజకీయాల్లోకి రాబోతున్నారా? కమలదళంలో చేరబోతున్నారా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పటికే బీజేపీ ఆయా రాష్ట్రాల్లో విజయం సాధించేందుకు వ్యూహ రచన చేస్తోందని సమాచారం. అందుకే ఇప్పటికే సినీ సెలబ్రిటీలను.. అలాగే ప్రముఖ క్రీడాకారులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఉత్సాహం చూపిస్తోంది. ఈ దిశలోనే అడుగులు వేస్తోంది.

ఈ క్రమంలోనే ఇప్పటికే బీజేపీ కేరళపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కేరళలో కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మెట్రో మ్యాన్ శ్రీధరన్‌ను ఆకర్షించింది. శ్రీధరన్‌కు మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుంది. అయితే 2017లో లక్నో మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీధరన్‌ను పట్టించుకోలేదని అప్పట్లో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన సలహాలు సూచనలతోనే లక్నో మెట్రో ప్రాజెక్టు వేగవంతంగా పూర్తయింది. ఐతే ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేదికపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధరన్ ఓ మూలన నిల్చున్న ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

అలాంటి శ్రీధరన్ ప్రస్తుతం బీజేపీలో చేరబోతున్నారన్న వార్త దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అలాగే ప్రస్తుతం పరుగుల రాణి పీటీ ఉష కూడా బీజేపీలో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో పీటీ ఉష బీజేపీకి అనుకూలంగా తన గళం వినిపించారు. దీనిపై పీటీ ఉష అయితే ఇప్పటి వరకూ స్పందించలేదు. అయితే పీటీ ఉషతో పాటు పలువురు ప్రముఖులు సైతం బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

More News

ముంబైలో ఫ్లాట్ కొన్న రష్మిక.. అక్కడే సెటిల్ అవుతుందా?

తెలుగులో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న కన్నడ భామ రష్మికా మందన్న.. అక్కడ కంటే టాలీవుడ్‌లో బాగా పాపులర్ అయ్యింది.

'శ్యామ్ ‌సింగ రాయ్' ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

ఒక టాలెంటెడ్ యాక్ట‌ర్‌, ఇంకో స‌మ‌ర్థుడైన డైరెక్ట‌ర్ క‌లిస్తే, ఒక మాగ్న‌మ్ ఓప‌స్ లాంటి సినిమా వ‌స్తుందంటారు.

మోదీ సొంత రాష్ట్రంలో కేజ్రీవాల్ పాగా..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో బీజేపీకి దారుణమైన దెబ్బ తగిలింది. మోదీ సొంత రాష్ట్రంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పాగా వేశారు.

ఏపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం వెనుక కారణమిదేనా?

వైసీపీ ప్రభుత్వం మంగళవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అమరావతిలో అసంపూర్తిగా మిగిలిపోయిన భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రూ.3000 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.

పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధం?

కేంద్ర పాలితప్రాంతమైన పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.