పూరి ఎవరి మాట వినడంతే..

  • IndiaGlitz, [Monday,November 09 2015]

డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం లోఫ‌ర్. ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్, దిశా ప‌టాని జంట‌గా న‌టించారు. సి.క‌ళ్యాణ్ ఈ సినిమాని నిర్మించారు. అయితే ఈ సినిమా టైటిల్ విష‌యంలో...ఆలోచ‌న‌లో ప‌డ్డామ‌ని..కొత్త టైటిల్ త్వ‌ర‌లోనే ఎనౌన్స్ చేస్తామ‌ని గ‌తంలో చిత్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌ ప్ర‌క‌టించారు. దీంతో అంతా లోఫ‌ర్ టైటిల్ కాస్త మా అమ్మ మ‌హాల‌క్ష్మి గా మారుతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. కానీ..పూరి...ఎవ‌రి మాట విన‌డంతే..టైటిల్ మార్చ‌లేదు. ముందు నుంచి అనుకున్న లోఫ‌ర్ టైటిల్ నే ఫిక్స్ చేసాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న లోఫ‌ర్ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేసేది త్వ‌ర‌లోనే ఎనౌన్స్ చేస్తార‌ట‌. మ‌రి...కంచె తో స‌క్సెస్ లో ఉన్న వ‌రుణ్ తేజ్ లోఫ‌ర్ తో మ‌రో స‌క్సెస్ సాధిస్తాడ‌ని ఆశిద్దాం.

More News

'శంకరాభరణం' ఆడియో సక్సెస్ మీట్

నిఖిల్,నందిత జంటగా నటిస్తున్న చిత్రం శంకరాభరణం.ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు నందనవనం తెరకెక్కించారు.ఈ మూవీకి కథ,కథనం, స్ర్కీన్ ప్లే అందించడంతో పాటు చిత్ర సమర్పకుడిగా కోన వెంకట్ వ్యవహరిస్తుండడం విశేషం.

బ‌న్ని నెక్ట్స్ మూవీ డైరెక్ట‌ర్ ఇత‌నే..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్ని బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కిస్తున్నారు.

సర్ధార్ రిలీజ్ లో మార్పు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ మూవీ సర్ధార్ గబ్బర్ సింగ్.ఈ చిత్రాన్ని పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

బోయపాటితో బన్ని హ్యాట్రిక్ కొడతాడా?

రేసుగుర్రంలా కథానాయకుల రేసులో దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్.ప్రస్తుతం ఈ మెగా వారి కథానాయకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ''సరైనోడు''సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మొన్న మహేష్.. నిన్న చరణ్.. నేడు అఖిల్..

1999లో మహేష్ బాబు ''రాజకుమారుడు''తో హీరోగా ఎంట్రీ ఇచ్చినా..2007లో ''చిరుత''తో రామ్ చరణ్ తెరంగేట్రం చేసినా..