పూరీ ‘జనగణమన’కు స్టారో హీరో దొరికాడు!

  • IndiaGlitz, [Thursday,September 12 2019]

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ‘జనగణమన’ చిత్రాన్ని తెరకెక్కించాలని డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఎప్పట్నుంచో అనుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే పూరీ వరుస ప్లాప్‌లతో సతమతం అవ్వడంతో.. ఆయనతో పనిచేయడానికి మహేశ్ అంతగా ఇంట్రెస్ట్ చూపలేదు. పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ మహేశ్‌తోనే సినిమా తీయాలని మైండ్‌లో పూరీ ఫిక్స్ అయిపోయాడు. అయినప్పటికీ మహేశ్ నుంచి ఎలాంటి స్పందన కాదు కదా.. లెక్కచేయకపోవడంతో ఇక వద్దనుకున్న పూరీ.. తెలుగుతో పాటు కన్నడ, తమిళ అగ్రహీరోల కోసం వేట సాగించారు.

అయితే ఎక్కడా ఈయనకు సరిపోయే హీరో దొరక్కపోవడంతో.. ఫైనల్‌‌గా టాలీవుడ్‌ స్టార్‌ హీరో యంగ్ రెబల్ ప్రభాస్‌తో ఈ సినిమా తీయాలని పూరీ దాదాపు ఫిక్స్ అయిపోయినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే విజయదేవరకొండ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే.. ‘జనగణమన’ను పట్టాలెక్కించాలని పూరీ భావిస్తున్నట్లు సమాచారం.

డార్లింగ్‌ రెడీ!

ఇదిలాఉంటే.. ఇప్పటికే మహేశ్‌కు పూరీ కథ వినిపించడమే కాదు.. ఓ డైలాగ్ కూడా వదలాడు. అయితే ఈ కథ గురించి కాస్త తెలుసుకున్న ప్రభాస్.. ‘సూపర్ పూరీ డార్లింగ్ బాగుంది’ అని తన సన్నిహితుల వద్ద అన్నాడట. ఈ విషయం ఈ చెవిన ఆ చెవిన పడి పూరీకి తెలియడంతో.. ప్రభాస్‌ను లైన్లో పెట్టాడట. ప్రస్తుతం ‘సాహో’ మూడ్‌లో ఉన్న ప్రభాస్‌కు కొద్దిరోజులు ఆగి తీరిగ్గా కూర్చొని కథ వినిపించాలని డాషింగ్ డైరెక్టర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మహేశ్ మిస్.. ప్రభాస్ ఫిక్స్!

కాగా.. ఇప్పటికే పూరీ-ప్రభాస్ కాంబోలో ‘బుజ్జిగాడు’, ‘ఏక్ నిరంజన్’ సినిమాలు వచ్చి మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే ‘జనగణమన’ వర్కవుట్ అయితే ముచ్చటగా మూడో సినిమా అన్న మాట. మొత్తానికి చూస్తే మహేశ్ ఈ సినిమా చేజేతులారా మిస్ చేసుకోవడంతో.. ప్రభాస్‌ను మాత్రం ‘జనగణమన’ వెతుక్కుంటూ వెళ్తోందన్న మాట. మరి ఈ వార్త పుకారుగానే మిగిలిపోతుందా..? పట్టాలెక్కి థియేటర్ల వరకు వస్తుందో తెలియాలంటే పూరీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే మరి.

More News

నెక్స్ట్ టార్గెట్ ‘పీవోకే’.. మేం దేనికైనా రెఢీ..!

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ భారత్‌లో పూర్తిగా అంతర్భాగమైన సంగతి తెలిసిందే. అయితే.. ఇక మిగిలిందల్లా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌‌ (పీవోకే) మాత్రమే. దీని కోసం అటు పాక్ పోరాటం చేస్తుండగా..

‘కారు’కు బ్రేక్‌కు ‘కమలం’ మాస్టర్ ప్లాన్.. అట్టర్‌ప్లాప్!?

తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా మారాలనుకుంటున్న బీజేపీ.. మాస్టర్ ప్లాన్‌తో ముందుకెళ్తోందా..? ప్రస్తుతానికి ఏపీని కాస్త పక్కనెట్టిన కమలనాథులు.. తెలంగాణలోని ‘కారు’

బాబూ.. పిచ్చి వేషాలు మానుకో.. పప్పులేం ఉడకవ్ : బొత్స

ఆంధ్రపదేశ్‌లో ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ తలపెట్టిన ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమం అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.

‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. ముఖ్య అతిథులుగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరియర్‌లోనే తొలిసారిగా ‘సైరా’ అనే చారిత్రక చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

జగన్ పాలనపై జనసేన రిపోర్ట్ రెడీ.. 14న రిలీజ్!

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో సీట్లను సంపాదించుకున్న వైసీపీ.. ఇటీవలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వందరోజులు పూర్తి చేసుకున్న విషయం విదితమే.