close
Choose your channels

స్టార్ హీరోతో పూరీ పాన్ ఇండియా మూవీ..!

Tuesday, January 5, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్టార్ హీరోతో పూరీ పాన్ ఇండియా మూవీ..!

టాలీవుడ్ డేరింగ్, డైనమిక్ డైరెక్టర్ పూరీజన్నాథ్ సినిమాలంటే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన తెరకెక్కించిన కొన్నిచిత్రాలు ఎవరూ ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ అవుతుంటాయ్.. మరికొన్ని సినిమాలు అట్టర్ ప్లాప్ అవుతుంటాయి. అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా సినిమాలు తెరకెక్కిస్తూ ముందుకెళ్తున్నాడు పూరీ. ‘ఇస్మార్ట్ శంకర్’ కంటే ముందు పూరీ పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలుసు.. కానీ ఈ ఒక్క సినిమాతో మళ్లీ ఆయన క్రీజులోకి వచ్చేశారు. అటు క్లాస్.. ఇటు మాస్‌ ఆడియన్స్‌ దగ్గరవ్వడం పూరీ స్టైల్.. అందుకే సింగిల్ సినిమాతో యావత్ ప్రపంచ వ్యాప్తంగా తన పేరు మార్మోగేలా చేసుకున్న రాక్‌స్టార్ యష్‌తో సినిమా చేయాలని.. అది కూడా పాన్ ఇండియా మూవీ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రస్తుతం క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి’ఫైటర్’ పాన్ ఇండియాను పూరీ తెరకెక్కించారు. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఈ గ్యాప్‌లో నెక్స్ట్ ఏం చేద్దాం..? ఎలాంటి మూవీ చేద్దాం.. ఎవరితో చేద్దాం..? ఎవరైతే మన స్టోరీకి సూటవుతారని ఆలోచించిన పూరీ ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ కథను రాసుకున్నాడట. ఈ సినిమా యష్‌కు అయితే బాగా సూట్అవుతుందని భావించి ఆయనతో కాంటాక్ట్ అయ్యి స్టోరీ లైన్ వినిపించాడట. పూరీ గురించి.. ఆయన సినిమాల గురించి తెలిసిన యష్.. ఏ మాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని టాక్. ఈ సినిమా పాన్ ఇండియా అని.. ఒకేసారి అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. మాఫియా నేపథ్యంలో సినిమా ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి పూరీ దగ్గర ఎప్పట్నుంచో ‘జనగణమన’ స్టోరీ అలాగే ఉండిపోయింది. మొదట సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఆ తర్వాత పవన్ కల్యాణ్.. ఈ ఇద్దరి తర్వాత యష్‌తో కూడా సంప్రదించాడని గత ఏడాది పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఆ కథనే యష్‌తో తెరకెక్కించాలని పూరీ అనుకుంటున్నాడా లేకుంటే రాక్‌స్టార్‌కు కొత్త కథ నిజంగానే రాస్తున్నాడా..? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోగా.. కనీసం పూరీ కూడా ఈ పుకార్లను ఖండించలేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం యష్ ‘కేజీఎఫ్ పార్ట్-02’లో బిజిబిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. జనవరి-08న ఉదయం 10 గంటల 18 నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ విజువల్‌ అనగా టీజర్ అభిమానుల ముందుకు రాబోతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos