ఎన‌ర్జీలో అన్న‌య్య‌ని కొట్టేవాడు పుట్ట‌డు: పూరి జ‌గ‌న్నాథ్‌

  • IndiaGlitz, [Monday,September 23 2019]

భారీ అంచ‌నాలు న‌డుమ మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి' అక్టోబ‌ర్ 2న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా కోసం మెగాభిమానులు, ప్రేక్ష‌కులే కాదు.. సినీ ప్ర‌ముఖులు కూడా ఎదురుచూస్తున్నారు. ఆదివారం సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘ‌నంగా జ‌రిగింది.

ఈ నేప‌థ్యంలో డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ 'సైరా న‌ర‌సింహారెడ్'డి యూనిట్‌ను అభినందిస్తూ ఓ వీడియోను త‌న ట్విట్ట‌ర్‌లో చేశారు. ''చాలా ఏళ్ల క్రితం చర‌ణ్ నాతో డాడీతో ఓ మెమొర‌బుల్ మూవీ తీయ్యాలి. అంద‌రూ ఫ్రౌడ్‌గా ఫీల్ కావాలన్నాడు. సైరా టీజ‌ర్ చూశాను. చూడ‌గానే నాకు చ‌ర‌ణ్ గుర్తుకొచ్చాడు. ఆరోజు ఎలా చెప్పాడో ఈరోజు సినిమాను అలాగే తీశాడు. గ్రాండియ‌ర్‌గా, విజువ‌ల్‌గా సినిమాను నిర్మించాడు. సురేంద‌ర్ రెడ్డి ఇర‌గొట్టేశాడు. ఇక అన్న‌య్య గురించి.. ఎనర్జీలో అన్న‌య్య‌ను కొట్టేటోడు మ‌ళ్లీ పుట్ట‌డు. ల‌వ్ యు అన్న‌య్య‌. సైరా చాలా పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని ట్విట్ట‌ర్‌లో వీడియో పోస్ట్ చేశారు పూరి.

ఈ ఏడాది ఇస్మార్ట్ శంక‌ర్‌తో బ్లాక్ బ్ల‌స్ట‌ర్ హిట్ కొట్టిన పూరి జ‌గ‌న్నాథ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో త‌దుప‌రి సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను పూరి ఇప్పుడు రెడీ చేస్తున్నాడట‌. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను పూరి, చార్మి నిర్మించ‌నున్నారు. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను సరికొత్త యాంగిల్‌లో పూరి ప్రెజంట్ చేయ‌నున్నారు.

More News

విఠల్ వాడి సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన నటుడు జగపతిబాబు

ఎన్.ఎన్ ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 విఠల్ వాడి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను నటుడు జగపతిబాబు విడుదల చేశారు.

క్వశ్చన్ పేపర్ లీకేజి ఫ్యామిలీ ప్యాకేజిగా మారింది!

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గ్రామ సచివాలయ పరీక్షా ప్రశ్నా పత్రాలు లీకేజీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.

మెట్రో స్టేషన్‌లలో ‘బిగ్‌బాస్ మిమ్మల్ని చూస్తున్నాడు’!

ఇదేంటి.. బిగ్‌బాస్ షో వరకే కదా జాగ్రత్తలు చెబుతున్నారేంటి అని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే..

కోలీవుడ్ వైపు బ‌న్నీ చూపు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నీ సినిమాల‌కు ఇటు తెలుగు, అటు మ‌ల‌యాళంలో మంచి క్రేజ్ ఉన్నాయి.

మనం సైతం ఐదవ వార్షికోత్సవం

ప్రముఖ నటులు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ ఐదవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.