పవన్ కోర్టులో పూరి జగన్నాధ్ బంతి !


Send us your feedback to audioarticles@vaarta.com


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేగంగా సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నా కరోనా అడ్డుకట్ట వేస్తోంది. ఓ వైపు జనసేన పార్టీ భాద్యతలు కూడా ఉండడంతో పవన్ వీలైనంత త్వరగా తన కమిటెడ్ ప్రాజెక్ట్స్ ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు, అయ్యప్పన్ కోషియం రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: హీరోతో రిలేషన్ షిప్.. ఇక దాగుడుమూతలు వద్దనుకుంటోందా?
ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక హరీష్ దర్శత్వంలో పవన్ నటించాల్సి ఉంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు పవన్ వద్దకు మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరినట్లు తెలుస్తోంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డ్రీమ్ ప్రాజెక్టు 'జనగణమన' ఎప్పటినుంచో పెండింగ్ లో ఉంది.
పూరి ఈ చిత్రాన్ని మొదట సూపర్ స్టార్ మహేష్ తో తీయాలనుకున్నాడు. కానీ మహేష్ ఈ చిత్రాన్ని పక్కన పెట్టేశాడు. దీనితో పూరి కూడా ఆ స్క్రిప్ట్ ని పక్కన పెట్టి వేరే కథలు చేసుకుంటున్నాడు. ఇక జనగణమన చిత్రాన్ని ఎలాగైనా పూర్తి చేయాలని పూరి భావిస్తున్నాడట. పవన్ ని కలసి కథ వినిపించినట్లు లేటెస్ట్ టాక్.
పవన్ నిర్ణయం కోసం పూరి ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. వేగంగా సినిమాలు పూర్తి చేయడంలో పూరి తర్వాతే ఎవరైనా. ఇలాంటి సమయంలో పవన్ కి కావాల్సింది కూడా అదే. దీనితో పవన్ ఈ ప్రాజెక్టుని ఓకే చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా పూరి జగన్నాధ్ బంతిని పవన్ కోర్టులోకి విసిరాడు.
ఇదివరకు పవన్, పూరి కాంబోలో రెండు చిత్రాలు వచ్చాయి. అందులో బద్రి విజయం సాధించగా, కెమెరామెన్ గంగతో రాంబాబు నిరాశపరిచింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.