close
Choose your channels

Rashmika Mandanna: రష్మికపై బ్యాన్.. కన్నడ నాట పుష్ప 2కి బాయ్‌కాట్ గండం..?

Monday, November 28, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వరుసపెట్టి సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకుంటూ నేషనల్ క్రష్‌గా మారిన కన్నడ కస్తూరి రష్మిక మందన్నపై ఇప్పుడు ఆమె సొంత ఇండస్ట్రీ గుర్రుగా వున్న సంగతి తెలిసిందే. తన తొలి సినిమా గురించి రష్మిక చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కన్నడ చిత్ర పరిశ్రమ, అభిమానులు మండిపడుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తనకు తొలి సినిమా అవకాశం ఎలా వచ్చిందో చెబుతూ రష్మిక చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

కిర్రాక్ పార్టీతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక :

2016లో వచ్చిన కన్నడ చిత్రం ‘‘కిర్రాక్ పార్టీ’’తో రష్మిక మందన్న హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమా కమర్షియల్‌గా హిట్‌గా నిలవడమే కాకుండా, ఆమెకు తెలుగులోనూ అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లలో బిజీ యాక్టర్‌గా మారడంతో రష్మిక కన్నడంలో ఎక్కువ సినిమాలు చేయడం లేదు.

అది ‘‘సోకాల్డ్’’ ప్రొడక్షన్ హౌస్:

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. తనకు కిరాక్ పార్టీలో అవకాశం ఎలా దక్కిందన్న దాని గురించి చెబుతూ, తనకు ఆ ఛాన్స్ ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరును చెప్పలేదు. దానికి ‘‘సోకాల్డ్’’ అంటూ వ్యాఖ్యానించింది . నిజానికి రష్మికకు ఈ సినిమా హీరో రక్షిత్ శెట్టికి చెందిన పరమ్‌వహా స్టూడియో అవకాశం ఇచ్చింది. ఈ చిత్ర నిర్మాణ సమయంలో రక్షిత్‌తో రష్మిక ప్రేమలో పడి అది ఎంగేజ్‌మెంట్ వరకు వెళ్లింది. కానీ మనస్పర్థల కారణంగా ఈ జంట పెళ్లి పీటలు ఎక్కకముందే ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నారు. అది రక్షిత్ శెట్టికి సంబంధించిన బ్యానర్ కావడం వల్లే ఆ ప్రొడక్షన్ హౌస్ పేరును ఇంటర్వ్యూలో రష్మిక ప్రస్తావించలేదని తెలుస్తోంది.

కాంతారాపైనా అలాంటి స్టేట్‌మెంట్:

దీంతో కన్నడ పరిశ్రమ గుస్సా అవుతోంది. ఇదొక కారణమైతే.. ఇటీవల రిలీజై ఘన విజయం సాధించిన కాంతారా సినిమాను తాను చూడలేదంటూ రష్మిక ఇచ్చిన స్టేట్‌మెంట్ కూడా శాండిల్ వుడ్‌లో కాకరేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో రష్మికపై బ్యాన్ విధించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. అయితే ఇదే జరిగితే ఆమె చేస్తున్న సినిమాలపై కన్నడ నాట ప్రభావం చూపే అవకాశం వుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. రష్మికకు శాండిల్ వుడ్‌లో నిషేధం విధించడంతో పాటు ఆమె నటించిన ఇతర భాషా చిత్రాలను ఎవ్వరూ చూడొద్దనే క్యాంపెయిన్ మొదలు కావొచ్చనే ప్రచారం జరుగుతోంది.

పుష్ప 2, వరిసులకు కర్ణాటకలో తిప్పలేనా :

ప్రస్తుతం రష్మిక.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘‘పుష్ప ది రూల్’’లో నటిస్తోంది. ఇది పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. అలాగే తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి సరసన ‘‘వరిసు’’లోనూ, ఇళయ దళపతి విజయ్ నటిస్తోన్న ‘‘వారసుడు’’లోనూ నటిస్తోంది. ఒకవేళ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమై... రష్మికపై నిషేధం పడితే మాత్రం ఈ సినిమాలకు కర్ణాటకలో ఇబ్బందులు తప్పవు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.