యార‌గెంట్ హీరోతో రాశీఖ‌న్నా

  • IndiaGlitz, [Tuesday,August 14 2018]

తొలిప్రేమతో స‌క్సెస్‌తోపాటు గ్లామ‌ర్‌గా కూడా బావుంది అని ప్ర‌శంస‌లు అందుకున్న హీరోయిన్ రాశీఖ‌న్నా.. త‌ర్వాత 'శ్రీనివాస‌క‌ళ్యాణం'లో న‌టించింది. అయితే ఇప్పుడు తెలుగులో రాశీ ఖ‌న్నా ఒకే ఒక సినిమా చేయ‌నుంది. త‌మిళంలో మూడు సినిమాలు చేస్తుంది. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో రాశీ ఖ‌న్నా త‌న తెలుగు సినిమా గురించి మాట్లాడుతూ..

వివ‌రాలను వెల్ల‌డించ‌లేన‌ని తెలిపింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం రాశీఖ‌న్నా తెలుగులో చేయ‌బోయే సినిమా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో అని తెలిసింది. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాను కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది.

More News

సినిమాల‌ను వ‌దిలేయ‌డం లేదు: స‌్వాతి

హీరోయిన్ స్వాతి ఈ నెల 30న ప్రియుడు వికాస్‌ను పెళ్లి చేసుకోనుంది. అయితే పెళ్లి త‌ర్వాత స్వాతి సినిమాల‌కు దూర‌మ‌వుతుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

న‌వంబ‌ర్‌లో సూర్య‌...

సెల్వ రాఘ‌వ‌న్ 'ఎన్‌.జి.కె' సినిమా త‌ర్వాత సూర్య, కె.వి.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమాతో బిజీగా ఉన్నాడు.

హీరోతో కాజ‌ల్ కికి చాలెంజ్

ఒక్కొక్క‌సారి ఓ చాలెంజ్ ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా పుణ్య‌మాని  ట్రెండింగ్‌లో ఉన్న చాలెంజ్ ...కికి ఛాలెంజ్.. గత కొంత కాలంగా ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ఛాలెంజ్ ఇది.

కేరళ తుఫాన్ బాధితుల సహయార్థం 25 లక్షలు ప్రకటించిన అల్లు అర్జున్

తుఫాను భీభత్సం తో అతలాకుతలం ఐన కేరళ ప్రజల్ని ఆదుకునేందుకు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందుకొచ్చారు.

బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ పాట విడుదల

ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్. మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా నటించారు. గోరేటి వెంకన్న ఓ కీలక పాత్ర పోషించారు.