ప్రభాస్ ఫ్యాన్స్ను కూల్ చేస్తున్న డైరెక్టర్


Send us your feedback to audioarticles@vaarta.com


రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న తాజా ప్యాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’. పూాజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ సహా ప్రభాస్, పూజా హెగ్డే ఫొటోలు మినహా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఏవీ లేవు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం మరో వైపు సినిమా అప్డేట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్గా కొత్త ఏడాది రోజునైనా టీజర్లాంటిదేమైనా రిలీజ్ చేస్తారేమోనని అందరూ వెయిట్ చేశారు. కానీ అలాంటిదేమీ లేదు. ఈ సినిమా కంటే ఆలస్యంగా మొదలైన సినిమాల నుండి అప్డేట్స్ వస్తున్నాయి. కానీ రాధేశ్యామ్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ లేవు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ డైరెక్టర్ని ఇతర యూనిట్ను నెట్స్లో ట్రోల్ చేసేస్తున్నారు.
అయితే కోపంతో తిక్కరేగిన ఫ్యాన్స్ను కూల్ చేయడానికి డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ రంగంలోకి దిగాడు. త్వరలోనే టీజర్ వస్తుందని, ఆ టీజర్ చూసి అందరూ సంతోషపడతారని చెప్పిన రాధాకృష్ణ.. నిరీక్షణకు తగ్గ ఫలితం ఉంటుందని.. ప్రామిస్ చేశాడు. డైరెక్టర్ చేసిన అనౌన్స్మెంట్ చూస్తుంటే.. సంక్రాంతికి రాధేశ్యామ్ టీజర్ ఉండేలా ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments