విశాల్‌, కార్తీల‌పై రాధికా ఫైర్‌

  • IndiaGlitz, [Wednesday,September 14 2016]

న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల్లో శ‌ర‌త్‌కుమార్ అండ్ టీంపై నాజ‌ర్ అండ్ విశాల్, కార్తీ టీం విజ‌యం సాధించిన‌ప్ప‌టి నుండి ఇద్ద‌రి మ‌ధ్య అడ‌పా ద‌డ‌పా మాట‌ల యుద్ధం జ‌రుగుతూనే ఉంది. నిన్న న‌డిగ‌ర్ సంఘంలో 1.65 కోట్ల మోసానికి పాల్ప‌డిన‌ట్టు గుర్తించిన ప్ర‌స్తుత సంఘం అధ్యక్షుడు శ‌ర‌త్‌కుమార్‌, కార్య‌ద‌ర్శి రాధార‌వి, కోశాధికారి చంద్ర‌శేఖ‌ర్‌ల‌ను తొలిగించి వారిపై పోలీసు పెట్ట‌డానికి తీర్మానం చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ విష‌యంపై రాధికా శర‌త్‌కుమార్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఫైర్ అయ్యారు. ముందు వంద‌కోట్ల మోసం జ‌రిగింద‌న్నారు. ఇప్పుడేమో 1.65 కోట్లంటున్నారు. ఏమైనా డిస్కౌంట్ ఇచ్చారా? అంటూ విశాల్ అండ్ గ్యాంగ్‌పై ఫైర్ అయ్యింది. ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్పుడు వివ‌ర‌ణ కోరకుండా వారి ప్రాథ‌మిక స‌భ్య‌త్వాల‌ను ఎలా తొలగించారు? మ‌న‌సులో ఇంత ద్వేషం పెట్టుకున్నారా? అంటూ ఫైర్ అయ్యింది. ఇంత‌కి దీనిపై విశాల్‌, కార్తీ అండ్ టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

More News

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో జయమ్ము నిశ్చయమ్మురా..!

"గీతాంజలి" తర్వాత శ్రీనివాస్ రెడ్డి-  "రాజు గారి గది" తర్వాత పూర్ణ జంటగా నటిస్తున్న నేటివిటీ హాస్యభరిత చిత్రం "జయమ్ము నిశ్చయమ్మురా". తెలుగు ప్రజలంతా ఒకే రాష్ట్రంలో ఉన్న రోజుల్ని గుర్తుకు తెస్తూ..

జ‌న‌తా గురించి నిజం మాట్లాడిన సుకుమార్..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా ఘ‌న విజ‌యం సాధించింది.

ద‌స‌రాకి వ‌స్తున్న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య న‌టిస్తున్న 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై రాజీవ్ రెడ్డి, క్రిష్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

19న తిరుప‌తిలో 'మ‌న‌లో ఒక‌డు' ఆడియో స‌క్సెస్ మీట్‌

ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టిస్తూ, సంగీతం అందిస్తూ  స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన చిత్రం మ‌న‌లో ఒక‌డు. ఈ చిత్రంలో నువ్వు నేను' ఫేం అనితా హెచ్. రెడ్డి కథానాయికగా న‌టించారు. యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జగన్ మోహన్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

ఈ నెల 23న వస్తున్న ఎరోటిక్ సస్పెన్స్‌ థ్రిల్లర్ రెడ్

కన్నడలో ఘన విజయం సాధించిన రెడ్‌ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో నిర్మిస్తున్నారు యువ నిర్మాత భరత్‌. కామిని, రాహుల్‌, రాజ్‌ ఆర్యన్‌, పృధ్వి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రాన్ని భరత్‌ పిక్చర్స్‌ పతాకం పై తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.