వర్మ పై ట్వీ ట్స్ గురించి రాజ్ తరుణ్ వివరణ....

  • IndiaGlitz, [Wednesday,November 18 2015]

ఉయ్యాల జంపాల చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన యువ క‌ధానాయ‌కుడు రాజ్ త‌రుణ్.ఉయ్యాల జంపాల త‌ర్వాత సినిమా చూపిస్త మామ చిత్రంతో మ‌రో విజ‌యం సాధించిన రాజ్ త‌రుణ్ కుమారి 21 ఎఫ్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఇటీవ‌ల రాజ్ త‌రుణ్ ట్విట్ట‌ర్ లో..రామ్ గోపాల్ వ‌ర్మ తో సినిమా చేస్తున్నాను. కానీ వ‌ర్మ ప్ర‌స్తుతం జ‌స్ట్ ఓకె ఓకె డైరెక్ట‌ర్. నేను డైరెక్ట‌ర్ అయితే రంగీల‌, శివ క‌న్నా బెట‌ర్ గా సినిమా చేయ‌గ‌ల‌ను అంటూ స్పందించాడు. ఇలా ట్వీట్స్ చేయ‌డం గురించి రాజ్ త‌రుణ్ ని వివ‌ర‌ణ అడిగితే...వ‌ర్మ గారే నా ఫోన్ తీసుకుని అలా ట్వీట్స్ చేసారు. తెలుగు సినిమాకి స‌రికొత్త గ‌మ్యాన్ని చూపిన ద‌ర్శ‌కుడు వ‌ర్మ గారు. ఆయ‌న అంటే నాకు గౌర‌వం. అలాంటి ఆయ‌న గురించి నేను అలా ఎలా ట్వీట్స్ చేస్తానంటూ అస‌లు విష‌యం చెప్పాడు అది సంగ‌తి.

More News

అక్కినేని నాగచైతన్య , శ్రుతిహాసన్ ల తొలి కాంబినేషన్..ఫిక్స్

అక్కినేని నాగ చైతన్య,శ్రుతి హాసన్ ల తొలి కాంబినేషన్లో 'కార్తికేయ' వంటి ఘన విజయం అందించిన 'చందు మొండేటి..దర్శకత్వంలో

'కుమారి 21 ఎఫ్' ప్లాటినమ్ డిస్క్..

హేబా పటేల్,రాజ్ తరుణ్ జంటగా సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి,థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్న చిత్రం 'కుమారి 21ఎఫ్'.

2015 తెలుగు సినిమా ప్రత్యేకత ఇదే...

ఫలితాలు,నిడివి..ఇలాంటి విషయాలను పక్కన పెడితే..2015 తెలుగు సినిమా చాలా ప్రత్యేకం.ఎందుకంటే..రెండు తరాల అగ్ర కథానాయకులు వెండితెరపై సందడి చేశారు కాబట్టి.

సూర్య '24' స్పెషాలిటీ...

'మనం'దర్శకుడు విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో సూర్య నటిస్తున్న చిత్రం '24'.నిత్యా మీనన్,సమంత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా 2016 సమ్మర్ లో రిలీజ్ కానుంది.

నానికిదే ఫస్ట్ టైమ్

ఏడేళ్లకు పైగా కథానాయకుడిగా అలరిస్తున్నాడు యువ కథానాయకుడు నాని.'అష్టా చెమ్మా'నుంచి 'భలేభలే మగాడివోయ్'' వరకు ఈజ్ తో కూడిన యాక్టింగ్ తో తనకంటూ ప్రేక్షక వర్గాన్ని సొంతం చేసుకున్నాడీ టాలెంటెడ్ హీరో.