close
Choose your channels

నాకు దెబ్బలేమీ తగల్లేదు.. ఎందుకు పరిగెత్తానంటే.. రాజ్ తరుణ్

Wednesday, August 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాకు దెబ్బలేమీ తగల్లేదు.. ఎందుకు పరిగెత్తానంటే.. రాజ్ తరుణ్

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌కి పెను ప్రమాదం నుంచి బయటపడ్డ విషయం విదితమే. మంగళవారం తెల్లవారు జామున ఆయన ప్రయాణిస్తున్న కారు నార్సింగి అల్కాపూర్ వద్దనున్న ఔటర్ రింగురోడ్డులో ప్రెద్ద ప్రమాదానికి గురవ్వడంతో రాజ్‌తరుణ్ బెలూన్స్ తెరుచుకోవడంతో రాజ్‌తరుణ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన రాజ్ తరుణ్.. తాజాగా అన్ని వివరాలను తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

నేను అదృష్టవంతుడ్ని!

"నా యోగక్షేమాలు తెలుసుకోవడానికి చాలామంది కాల్స్ చేస్తున్నారనీ, ఇంత మంది ప్రేమను పొందినందుకు నేను అదృష్టవంతున్ని. నార్సింగి సర్కిల్‌లో గత 3 నెలలుగా చాలా ప్రమాదాలు జరిగాయి. కారు ప్రమాదం అనంతరం నేను అక్కడ్నుంచి ఇంటికి చేరుకున్నాను" అని చెప్పుకొచ్చారు.

ఆ రోజు అసలేం జరిగింది..?

"నార్సింగి సర్కిల్‌లో ఒక్కసారిగా కుడివైపు టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. దీంతో నేను కారుపై నియంత్రణ కోల్పోయాను. కారు ఒక్కసారిగా వెళ్లి పక్కనే ఉన్న గోడను బలంగా ఢీకొట్టింది. అప్పుడు వచ్చిన శబ్దానికి నా రెండు చెవులు పనిచేయలేదు. చూపు కూడా సరిగ్గా కనిపించలేదు. గుండె దడ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు నేను సీట్ బెల్ట్ పెట్టుకునే ఉన్నాను. నాకు దెబ్బలేమీ తగలలేదని నిర్ధారించుకున్నాక కారు నుంచి బయటపడ్డాను. ఆ ఆందోళనలో ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్లాను. ఆరోజు రాత్రి జరిగింది ఇదే. మిగిలిన విషయాలు త్వరలోనే బయటకు వస్తాయి. త్వరలోనే మళ్లీ సినిమా షూటింగులో పాల్గొంటాను. మీ ప్రేమకు ధన్యవాదాలు’ అని రాజ్ తరుణ్ ట్వీట్ చేశాడు. అంటితో ఆగని రాజ్ సీటు బెల్టే ప్రమాదం నుంచి తనను కాపాడిందనీ, సీట్ బెల్ట్ ధరించాలని ఈ సందర్భంగా సూచించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.