జనవరిలో 'సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు'

  • IndiaGlitz, [Wednesday,November 25 2015]

ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న రాజ్ తరుణ్ కుమారి 21 ఎఫ్' చిత్రంతో హ్యాట్రిక్‌ను సాధించి క్రేజీస్టార్‌గా మారాడు. ఇక ఇప్పుడు అందరి దృష్టి రాజ్‌తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు' చిత్రంపై వుంది. షూటింగ్‌ను పూర్తిచేసుకొని, నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రానికి శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకుడు. శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్‌బాబు సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సున్నితమైన భావోద్వేగాలకు, వినోదానికి పెద్ద పీటవేశాం. రాజ్‌తరుణ్ పాత్ర సరికొత్తగా వుంటుంది. ఈ చిత్రంతో అర్తన అనే నూతన హీరోయిన్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతుంది. నవ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలోని పతాక సన్నివేశాలను భారీఖర్చుతో చిత్రీకరించాం. చిత్రంలో పతాక సన్నివేశాలు హైలైట్‌గా వుంటాయి. తప్పకుండా ఈ చిత్రం రాజ్‌తరుణ్ సెకండ్ హ్యాట్రిక్‌కు శ్రీకారంలా వుంటుంది. డిసెంబరులో ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలను విడుదల చేసి, జనవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు.

రాజ్‌తరుణ్, అర్తన, రణధీర్, రాజా రవీంద్ర, ఆదర్శ్, షకలక శంకర్, మధునందన్, విజయ్, జోగినాయుడు, సురేఖావాణి, శ్రీలక్ష్మి, హేమ, రత్నసాగర్, నవీన్, భార్గవి తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, పాటలు: సుద్ధాల అశోక్‌తేజ, రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, వనమాలి, కృష్ణచైతన్య, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, కెమెరా: విశ్వ, ఆర్ట్: జేవీ, అడిషనల్ డైలాగ్స్: అనీల్ మల్లెల, ప్రొడక్షన్ కంట్రోలర్: కొర్రపాటి వెంకటరమణ, సమర్పణ; శ్రీమతి పూర్ణిమ ఎస్‌బాబు, కథస్కీన్‌ప్లే--దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి.

More News

మహేష్ నో చెప్పిన కథను ఓకె చేసిన సూర్య..

సూపర్ స్టార్ మహేష్ నో చెప్పిన కథను హీరో సూర్య ఓకె చేసాడట.ఇంతకీ అది ఏ సినిమా అంటారా..?సూర్య ప్రస్తుతం నటిస్తున్న 24.

వినాయ‌క్ వెన‌క్కి ఇస్తున్నాడ‌ట‌..

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ నాగ్ వార‌సుడు అఖిల్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ..అఖిల్ సినిమాని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే.

హిట్ కాంబినేషన్ ...పవన్ తో

2001లో విడుదలైన ‘ఖుషీ’సినిమాను తెలుగు ప్రేక్షకులు,మెగాభిమానులు అంత సులభంగా మరచిపోరు.ఎస్.జె.సూర్య దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

బాల‌య్య‌తో మ‌రోసారి ఢీ కొడుతున్నహీరో..

నంద‌మూరి న‌ట సింహం బాల‌క్రిష్ణ ప్ర‌స్తుతం 99వ సినిమా డిక్టేట‌ర్ చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది.

చిన్న హీరోకి పెద్ద హీరో సపోర్ట్..

చిన్న హీరోకి పెద్ద హీరో సపోర్ట్ దొరికింది.ఇంతకీ ఆ చిన్న హీరో..పెద్ద హీరో ఎవరనుకుంటున్నారా..?చిన్న హీరో తను నేను సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న సంతోష్ శోభన్.సపోర్ట్ ఇస్తున్న పెద్ద హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు.